Tamannaah : వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా.. ఎఫ్3. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో వసూళ్లను వసూలు చేస్తోంది. దీంతో సినిమా రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరింది. ఇక త్వరలోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించనుంది. ఎఫ్2 కన్నా భారీ స్థాయిలో ఈమూవీ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే చిత్ర బృంద సభ్యులు సక్సెస్ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో తమన్నా ఎక్కడా కనిపించలేదు. దీంతో చిత్ర యూనిట్కు, తమన్నాకు మధ్య గొడవ జరిగిందని అందరూ అనుకున్నారు. ఈ వార్తలపై చిత్ర యూనిట్ కూడా స్పందించలేదు. అయితే ఇదే విషయంపై అనిల్ రావిపూడి స్పందించారు.
తమన్నాతో గొడవ ఏమైనా పడ్డారా.. ఆమె చిత్ర రిలీజ్కు ముందు జరిగిన ప్రమోషన్లలో ఎందుకు పాల్గొనలేదు.. అని పలువురు ప్రశ్నించగా.. అందుకు ఎఫ్3 దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అలా ఏమీ లేదు, అవన్నీ పుకార్లే, వాస్తవానికి తమన్నా ఆ సమయంలో కేన్స్ ఉత్సవాల్లో బిజీగా ఉంది. కనుకనే ఆమె ప్రమోషన్లకు రాలేదు.. అని అనిల్ రావిపూడి చెప్పారు.
అయితే అంత వరకు బాగానే ఉన్నా.. సోషల్ మీడియా అయితే చేతిలో ఉందిగా.. మరి సినిమా రిలీజ్ అయ్యే సమయంలో కనీసం అందులో అయినా ఒక పోస్ట్ పెట్టవచ్చు కదా. తమన్నా కనీసం ఆ పని కూడా చేయలేదు. అంటే.. సోషల్ మీడియాను వాడేంత సమయం కూడా తమన్నాకు దొరకలేదా.. అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏది ఏమైనా.. అనిల్ రావిపూడి సమాధానం చెప్పారు కానీ.. అది అంత సంతృప్తిగా లేదు. మరి ముందు ముందు దీనిపై క్లారిటీ ఏమైనా వస్తుందేమో చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…