Jabardasth : జబర్దస్త్ షో అంటే ఒకప్పుడు ఇంటిల్లిపాదీ కూర్చుని ఎంతో సరదాగా నవ్వుకునేవారు. కానీ తరువాత పరిస్థితి మారిపోయింది. అందులో చేసే స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగ్లు ఎక్కువయ్యాయి. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమయ్యారు. అయినా సరే రేటింగ్స్ ఏమాత్రం తగ్గకుండా ఈ షో కొనసాగింది. తరువాత ఎక్స్ట్రా జబర్దస్త్ను కూడా మొదలుపెట్టారు. ఇది కూడా బంపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. జడ్జిలు లేరు.. కమెడియన్లు లేరు. దీంతో ఈ షో కళ తప్పింది. అయితే త్వరలోనే ఈ షోకు భారీ ఝలక్ తగలనున్నట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ షోలో ఎంతో సుదీర్ఘకాలం నుంచి ఉన్న కమెడియన్లు సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోయారు. తరువాత హైపర్ ఆది కూడా ఈ షోకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. దీంతో స్టార్ కమెడియన్లు దూరం అయ్యాక జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అని రెండు షోలను నిర్వహించడం.. వాటికి రేటింగ్స్ వచ్చేలా చేయడం.. నిర్వాహకులకు కష్టమే అవుతుంది. కనుక కేవలం జబర్దస్త్ అని ఒక్క షోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే.. షోకు ఉన్న కళ ఇంకా తప్పిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పరిస్థితిలో ఇద్దరు యాంకర్లు ఉండరు కదా. కనుక రెమ్యునరేషన్ తక్కువ తీసుకునే రష్మినే కొనసాగిస్తారు. అప్పుడు అనసూయకు చాన్స్ ఉండదు. ఇలా అనసూయను కూడా ఈ షో నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఇది జబర్దస్త్ షోకు భారీ ఝలక్ కానుందని అర్థం చేసుకోవచ్చు.
ఇలా జబర్దస్త్ షోలో మరిన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయని సమాచారం. అయితే ఇదే గనక జరిగితే అప్పుడు ఈ షోకు ఇక రేటింగ్స్ ఉంటాయా.. లేదా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ షో నుంచి పేరున్న కమెడియన్స్ అందరూ ఇప్పటికే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై దీన్ని గతంలో మాదిరిగా ఆదరిస్తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే ఇవన్నీ సందేహాలే.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. కానీ జబర్దస్త్ భవితవ్యం ఏమిటన్నది ఏనాటికైనా తేలక తప్పదు. అప్పటి వరకు వేచి చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…