Jabardasth : జబర్దస్త్ షో అంటే ఒకప్పుడు ఇంటిల్లిపాదీ కూర్చుని ఎంతో సరదాగా నవ్వుకునేవారు. కానీ తరువాత పరిస్థితి మారిపోయింది. అందులో చేసే స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగ్లు ఎక్కువయ్యాయి. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమయ్యారు. అయినా సరే రేటింగ్స్ ఏమాత్రం తగ్గకుండా ఈ షో కొనసాగింది. తరువాత ఎక్స్ట్రా జబర్దస్త్ను కూడా మొదలుపెట్టారు. ఇది కూడా బంపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. జడ్జిలు లేరు.. కమెడియన్లు లేరు. దీంతో ఈ షో కళ తప్పింది. అయితే త్వరలోనే ఈ షోకు భారీ ఝలక్ తగలనున్నట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ షోలో ఎంతో సుదీర్ఘకాలం నుంచి ఉన్న కమెడియన్లు సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోయారు. తరువాత హైపర్ ఆది కూడా ఈ షోకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. దీంతో స్టార్ కమెడియన్లు దూరం అయ్యాక జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అని రెండు షోలను నిర్వహించడం.. వాటికి రేటింగ్స్ వచ్చేలా చేయడం.. నిర్వాహకులకు కష్టమే అవుతుంది. కనుక కేవలం జబర్దస్త్ అని ఒక్క షోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే.. షోకు ఉన్న కళ ఇంకా తప్పిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పరిస్థితిలో ఇద్దరు యాంకర్లు ఉండరు కదా. కనుక రెమ్యునరేషన్ తక్కువ తీసుకునే రష్మినే కొనసాగిస్తారు. అప్పుడు అనసూయకు చాన్స్ ఉండదు. ఇలా అనసూయను కూడా ఈ షో నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఇది జబర్దస్త్ షోకు భారీ ఝలక్ కానుందని అర్థం చేసుకోవచ్చు.
ఇలా జబర్దస్త్ షోలో మరిన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయని సమాచారం. అయితే ఇదే గనక జరిగితే అప్పుడు ఈ షోకు ఇక రేటింగ్స్ ఉంటాయా.. లేదా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ షో నుంచి పేరున్న కమెడియన్స్ అందరూ ఇప్పటికే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై దీన్ని గతంలో మాదిరిగా ఆదరిస్తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే ఇవన్నీ సందేహాలే.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. కానీ జబర్దస్త్ భవితవ్యం ఏమిటన్నది ఏనాటికైనా తేలక తప్పదు. అప్పటి వరకు వేచి చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…