Jabardasth : జబర్దస్త్ షో అంటే ఒకప్పుడు ఇంటిల్లిపాదీ కూర్చుని ఎంతో సరదాగా నవ్వుకునేవారు. కానీ తరువాత పరిస్థితి మారిపోయింది. అందులో చేసే స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగ్లు ఎక్కువయ్యాయి. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమయ్యారు. అయినా సరే రేటింగ్స్ ఏమాత్రం తగ్గకుండా ఈ షో కొనసాగింది. తరువాత ఎక్స్ట్రా జబర్దస్త్ను కూడా మొదలుపెట్టారు. ఇది కూడా బంపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. జడ్జిలు లేరు.. కమెడియన్లు లేరు. దీంతో ఈ షో కళ తప్పింది. అయితే త్వరలోనే ఈ షోకు భారీ ఝలక్ తగలనున్నట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ షోలో ఎంతో సుదీర్ఘకాలం నుంచి ఉన్న కమెడియన్లు సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోయారు. తరువాత హైపర్ ఆది కూడా ఈ షోకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. దీంతో స్టార్ కమెడియన్లు దూరం అయ్యాక జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అని రెండు షోలను నిర్వహించడం.. వాటికి రేటింగ్స్ వచ్చేలా చేయడం.. నిర్వాహకులకు కష్టమే అవుతుంది. కనుక కేవలం జబర్దస్త్ అని ఒక్క షోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే.. షోకు ఉన్న కళ ఇంకా తప్పిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పరిస్థితిలో ఇద్దరు యాంకర్లు ఉండరు కదా. కనుక రెమ్యునరేషన్ తక్కువ తీసుకునే రష్మినే కొనసాగిస్తారు. అప్పుడు అనసూయకు చాన్స్ ఉండదు. ఇలా అనసూయను కూడా ఈ షో నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. ఇది జబర్దస్త్ షోకు భారీ ఝలక్ కానుందని అర్థం చేసుకోవచ్చు.
ఇలా జబర్దస్త్ షోలో మరిన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయని సమాచారం. అయితే ఇదే గనక జరిగితే అప్పుడు ఈ షోకు ఇక రేటింగ్స్ ఉంటాయా.. లేదా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ షో నుంచి పేరున్న కమెడియన్స్ అందరూ ఇప్పటికే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై దీన్ని గతంలో మాదిరిగా ఆదరిస్తారా.. అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే ఇవన్నీ సందేహాలే.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. కానీ జబర్దస్త్ భవితవ్యం ఏమిటన్నది ఏనాటికైనా తేలక తప్పదు. అప్పటి వరకు వేచి చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…