Jabardasth : జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చిందన్న విషయం తెలిసిందే. ఇందులో గుర్తింపు పొందిన అనేకమంది ఆర్టిస్టులు సినిమాల్లో కూడా నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే కొన్ని కారణాలతో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. అయితే హైపర్ ఆది రీఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ షో కళకళలాడుతోంది. కమెడియన్స్ అంతా తమదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. కమెడియన్లు 2 టీమ్స్ గా విడిపోయి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు.
బులెట్ భాస్కర్, ఇమ్మాన్యూల్, రాకింగ్ రాజేష్ ఒక గ్యాంగ్ గా మారి క్రికెట్ బ్యాట్స్ తో ఎంట్రీ ఇచ్చారు. మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇద్దరు అబ్బాయిలని ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు వలలో వేసుకున్నారు. మా అబ్బాయిలని వదిలేయండి.. లేకుంటే రక్తపాతాలే అంటూ ఇమ్మాన్యూల్ కామెడీగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక హైపర్ ఆది, రాకెట్ రాఘవ తన గ్యాంగ్ తో హాకీ స్టిక్స్ చేత పట్టుకుని రంగంలోకి దిగారు. హైపర్ ఆది ఆపోజిట్ గ్యాంగ్ పై తనదైన శైలిలో వరుసగా పంచ్ డైలాగ్స్ పేల్చాడు.
మధ్యలో బుల్లెట్ భాస్కర్ కల్పించుకుని.. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఎందుకు రష్మీ.. పద వెళదాం.. నీ పేమెంట్ నేను ఇంటికి పంపిస్తా అని బీరాలు పలుకుతూ చెబుతాడు. దీంతో బులెట్ భాస్కర్ కి హైపర్ ఆది ఇచ్చిన కౌంటర్ అదిరిపోయింది. నువ్వు రష్మీకి రెమ్యునరేషన్ ఇవ్వాలంటే 100 పెద్దమనిషి ఫంక్షన్స్ చేసినా సరిపోదు అంటూ కామెంట్స్ చేశాడు. దీనితో అక్కడున్న వారంతా నవ్వేశారు. ఇది కేవలం ప్రోమో మాత్రమే కంప్లీట్ ఎపిసోడ్ అక్టోబర్ 20న ప్రసారం కానుంది. హైపర్ ఆది రీఎంట్రీ తో జబర్దస్త్ కి కొత్త జోష్ తీసుకువచ్చాడు అంటున్నారు నెటిజన్స్.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…