Upasana : మెగా కోడలిగా ఎంతో గుర్తింపు పొందిన కొణిదెల ఉపాసన ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నీ మధ్యే ఓ కార్యక్రమంలో సద్గురుతో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. చరణ్, ఉపాసన కావాలనే పిల్లల్ని కనడం లేదని.. అందుకు సద్గురు వారిని అభినందించారని.. వార్తలు వచ్చాయి. పెళ్లయ్యాక 10 ఏళ్ల తరువాతే వారు పిల్లల్ని కనాలని అనుకున్నారని.. కనుక ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్తి అయ్యాయి కాబట్టి ఇక ఈ సంవత్సరం చరణ్, ఉపాసన కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తి వస్తారు.. అని ఫ్యాన్స్ తెగ ప్రచారం చేశారు. అయితే తరువాత దీనిపై ఉపాసన క్లారిటీ ఇచ్చారు.
ఇక ఉపాసన ఈ మధ్యే కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. ఆమె హెల్త్ కండిషన్ సీరియస్గా ఉందని ప్రచారం చేస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదని స్పష్టమైంది. తాజాగా ఆమె తన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసి చరణ్ ఆశీస్సులను తీసుకున్నారు. దీంతో ఆమె ఆ సమయంలో తీసిన ఫొటోను షేర్ చేశారు. అందులో ఆమె ఆరోగ్యంగానే కనిపించారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.
ఇక చరణ్, ఉపాసన విడిపోతున్నారని కూడా కొందరు ప్రచారం చేశారు. కానీ ఆ ఒక్క ఫొటో ద్వారా ఉపాసన పుకార్లన్నింటికీ చెక్ పెట్టినట్లు అయింది. చరణ్తో ఆమె ఎంతో సన్నిహితంగా ఉండడాన్ని మనం చూడవచ్చు. అయితే మెగా ఫ్యామిలీపై పుకార్లు రావడం కొత్తేమీ కాదు. కానీ ఈ మధ్య కాలంలో పుకార్లు ఎక్కువయ్యాయి. మొన్నీ మధ్యే నిహారిక తన భర్తతో విడాకులు తీసుకుందని ప్రచారం చేశారు. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇక శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతుల గురించి కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే వారి విషయమే ఎటూ తేలడం లేదు. కాగా చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా.. ఆ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తేలాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…