Upasana : మెగా కోడలిగా ఎంతో గుర్తింపు పొందిన కొణిదెల ఉపాసన ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నీ మధ్యే ఓ కార్యక్రమంలో సద్గురుతో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. చరణ్, ఉపాసన కావాలనే పిల్లల్ని కనడం లేదని.. అందుకు సద్గురు వారిని అభినందించారని.. వార్తలు వచ్చాయి. పెళ్లయ్యాక 10 ఏళ్ల తరువాతే వారు పిల్లల్ని కనాలని అనుకున్నారని.. కనుక ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్తి అయ్యాయి కాబట్టి ఇక ఈ సంవత్సరం చరణ్, ఉపాసన కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తి వస్తారు.. అని ఫ్యాన్స్ తెగ ప్రచారం చేశారు. అయితే తరువాత దీనిపై ఉపాసన క్లారిటీ ఇచ్చారు.
ఇక ఉపాసన ఈ మధ్యే కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె ఆరోగ్యంపై అనేక వార్తలు వస్తున్నాయి. ఆమె హెల్త్ కండిషన్ సీరియస్గా ఉందని ప్రచారం చేస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదని స్పష్టమైంది. తాజాగా ఆమె తన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసి చరణ్ ఆశీస్సులను తీసుకున్నారు. దీంతో ఆమె ఆ సమయంలో తీసిన ఫొటోను షేర్ చేశారు. అందులో ఆమె ఆరోగ్యంగానే కనిపించారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.
ఇక చరణ్, ఉపాసన విడిపోతున్నారని కూడా కొందరు ప్రచారం చేశారు. కానీ ఆ ఒక్క ఫొటో ద్వారా ఉపాసన పుకార్లన్నింటికీ చెక్ పెట్టినట్లు అయింది. చరణ్తో ఆమె ఎంతో సన్నిహితంగా ఉండడాన్ని మనం చూడవచ్చు. అయితే మెగా ఫ్యామిలీపై పుకార్లు రావడం కొత్తేమీ కాదు. కానీ ఈ మధ్య కాలంలో పుకార్లు ఎక్కువయ్యాయి. మొన్నీ మధ్యే నిహారిక తన భర్తతో విడాకులు తీసుకుందని ప్రచారం చేశారు. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇక శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతుల గురించి కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే వారి విషయమే ఎటూ తేలడం లేదు. కాగా చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా.. ఆ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తేలాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…