భారత్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక సుప్రీం కోర్టు దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని వ్యాఖ్యలు చేసింది. దీన్ని బట్టే సులభంగా అర్థం చేసుకోవచ్చు, దేశంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో. అయితే మన దేశంలో ఉన్న పరిస్థితిని చూసి పలు ఇతర దేశాలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. మన దాయాది దేశమైన పాకిస్థాన్ కూడా మనకు సహాయం చేస్తామని ప్రకటించింది.
పాకిస్థాన్ ప్రధాని భారత్కు కావల్సిన సహాయం చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందులో భాగంగానే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఖురేషి ఇండియాకు సహాయం చేస్తామని ట్వీట్ చేశారు. భారత్కు తక్షణమే వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్రే యంత్రాలు, పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.
ఈ సందర్బంగా ఖురేషీ మాట్లాడుతూ.. భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. కరోనాతో తీవ్రంగా పోరాటం చేస్తున్న భారత్కు సంఘీభావం తెలుపుతున్నాం. భారత్కు అవసరమైన వైద్య సామగ్రి, ఆధునిక యంత్రాలను పంపిస్తాం. ఇందుకు ఇరు దేశాలకు చెందిన అధికారులు కృషి చేయాలి.. అని అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…