భారత్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. రోజుకు 3 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక సుప్రీం కోర్టు దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని వ్యాఖ్యలు చేసింది. దీన్ని బట్టే సులభంగా అర్థం చేసుకోవచ్చు, దేశంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో. అయితే మన దేశంలో ఉన్న పరిస్థితిని చూసి పలు ఇతర దేశాలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. మన దాయాది దేశమైన పాకిస్థాన్ కూడా మనకు సహాయం చేస్తామని ప్రకటించింది.
పాకిస్థాన్ ప్రధాని భారత్కు కావల్సిన సహాయం చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందులో భాగంగానే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఖురేషి ఇండియాకు సహాయం చేస్తామని ట్వీట్ చేశారు. భారత్కు తక్షణమే వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్రే యంత్రాలు, పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.
ఈ సందర్బంగా ఖురేషీ మాట్లాడుతూ.. భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. కరోనాతో తీవ్రంగా పోరాటం చేస్తున్న భారత్కు సంఘీభావం తెలుపుతున్నాం. భారత్కు అవసరమైన వైద్య సామగ్రి, ఆధునిక యంత్రాలను పంపిస్తాం. ఇందుకు ఇరు దేశాలకు చెందిన అధికారులు కృషి చేయాలి.. అని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…