ప్రస్తుతం భారతదేశం కరోనా సంక్షోభంలో మునిగిపోయింది. కరోనా కేసులు తీవ్రంగా వ్యాపించడంతో రోజురోజుకు కేసుల సంఖ్య అధికం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అందక ఆరోగ్య వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయింది. ఆక్సిజన్ కొరత వల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులలో ఇండియాని కాపాడటం కోసం పలు దేశాలు ముందుకు రావాలని, ఇండియాకు ఆక్సిజన్ ఇచ్చి కాపాడుదామని పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ వీడియో ద్వారా ఇండో-పాక్ అభిమానులకు సందేశం ఇస్తున్నారు.
ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యంతో కూడుకున్న పని. ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇచ్చి కాపాడుదామని పాకిస్తాన్ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న పరిస్థితులలో ఇతర దేశాల సహాయం ఇండియాకు ఎంతో అవసరం ఉంది ఈ సమయంలోనే మనమందరం కలిసికట్టుగా ఉంటూ ఈ పరిస్థితులను ఎదుర్కోవాలని షోయబ్ తెలిపారు.
ప్రస్తుతం ఇండియాకు చాలా ట్యాంకులు ఆక్సిజన్ అవసరం ఉంది. ప్రతి ఒక్కరు విరాళాలను సేకరించి ఇండియాకు సరిపడేంత ఆక్సిజన్ అందించి ఇండియాను కాపాడాలని షోయబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పిలుపునిచ్చారు. ఇంతకుముందు కూడా ఇండియా పరిస్థితులను గమనించిన షోయబ్ ఇండియాకు సహాయం చేయాల్సిందిగా పలు దేశాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరిన సంగతి మనకు తెలిసిందే.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…