ప్రముఖ నటుడు, సంఘ సంస్కర్త సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో గత 4 రోజుల నుంచి ఇన్కమ్ట్యాక్స్ విభాగం సోదాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయన రూ.20 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టారని ఐటీ విభాగం తెలిపింది. బోగస్ లోన్లు తీసుకోవడంతోపాటు విదేశాల నుంచి నిధులను రాబట్టడంలో నిబంధనలను ఆయన ఉల్లంఘించారని ఐటీ శాఖ అధికారులు ఆరోపించారు. అయితే ఈ విషయంపై సోనూసూద్ స్పందించారు.
గత కొద్ది రోజులుగా తన ఇళ్లు, ఆఫీసులకు అతిథులు వస్తున్నారని, అందువల్ల ప్రజా సేవ చేయలేకపోతున్నానని సోనూ సూద్ తెలిపారు. మళ్లీ ప్రజలకు సేవ చేసేందుకు అందుబాటులో ఉంటానన్నారు. తన ఫౌండేషన్లో ప్రతి ఒక్కరు ఇందుకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నారు. తనకు ఎండార్స్మెంట్ల ద్వారా లభించే ఆదాయం మొత్తాన్ని పేదల కోసం సహాయం చేసేందుకు విరాళం ఇవ్వాల్సిందిగా ఆయా కంపెనీలను కోరినట్లు తెలిపారు.
తన గురించి ప్రజలకు తెలుసని, తాను ఏమిటనేది అందరికీ తెలుసని, దాని గురించి కథలు చెప్పాల్సిన పనిలేదని సోనూ సూద్ తెలిపారు. దేశ ప్రజలందరూ తన వెంట ఉన్నారని సోనూసూద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో భావోద్వేగ పోస్టు పెట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…