సాధారణంగా కొందరికి మూగజీవాలు అంటే ఎంతో ఇష్టం, ప్రేమ ఉంటాయి. ఈ క్రమంలోనే వాటి కోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఆ పెంపుడు జంతువులు కూడా యజమాని పట్ల అంతే ప్రేమ, విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. ఇలా ఎంతో అపురూపంగా చూసుకునే జంతువులకు ఏ చిన్నపాటి గాయమైనా తల్లడిల్లిపోతుంటారు. అలాగే వీటిపై ఉన్న ప్రేమతో కొందరు ఎక్కడికి ప్రయాణించినా వారితోపాటు ఈ పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకెళ్లడం మనం చూస్తూ ఉంటాము.
తాజాగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి విమానంలో ప్రయాణించాలని భావించాడు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్క కోసం విమానంలో ఉన్న బిజినెస్ కేబిన్ మొత్తం బుక్ చేసుకొని తన పెంపుడు కుక్కతో కలిసి ముంబై నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ లో ప్రయాణం చేశాడు. ఇలా తన కుక్క తో కలిసి ప్రయాణం చేసినందుకు ఆ యజమాని ఏకంగా 2.50 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు.
ఎయిర్ ఇండియా విమానం AI-671లో టికెట్స్ బుక్ చేశాడు. ఈ విమానంలో బిజినెస్ క్లాస్ లో 12 సీట్లు ఉంటాయి. అయితే తనకెంతో ఇష్టమైన పెంపుడు కుక్కకు ఎంతో సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో సదరు యజమాని ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసి ముంబై నుంచి చెన్నై కి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…