సాధారణంగా కొందరికి మూగజీవాలు అంటే ఎంతో ఇష్టం, ప్రేమ ఉంటాయి. ఈ క్రమంలోనే వాటి కోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఆ పెంపుడు జంతువులు కూడా యజమాని పట్ల అంతే ప్రేమ, విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. ఇలా ఎంతో అపురూపంగా చూసుకునే జంతువులకు ఏ చిన్నపాటి గాయమైనా తల్లడిల్లిపోతుంటారు. అలాగే వీటిపై ఉన్న ప్రేమతో కొందరు ఎక్కడికి ప్రయాణించినా వారితోపాటు ఈ పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకెళ్లడం మనం చూస్తూ ఉంటాము.
తాజాగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి విమానంలో ప్రయాణించాలని భావించాడు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్క కోసం విమానంలో ఉన్న బిజినెస్ కేబిన్ మొత్తం బుక్ చేసుకొని తన పెంపుడు కుక్కతో కలిసి ముంబై నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ లో ప్రయాణం చేశాడు. ఇలా తన కుక్క తో కలిసి ప్రయాణం చేసినందుకు ఆ యజమాని ఏకంగా 2.50 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు.
ఎయిర్ ఇండియా విమానం AI-671లో టికెట్స్ బుక్ చేశాడు. ఈ విమానంలో బిజినెస్ క్లాస్ లో 12 సీట్లు ఉంటాయి. అయితే తనకెంతో ఇష్టమైన పెంపుడు కుక్కకు ఎంతో సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో సదరు యజమాని ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసి ముంబై నుంచి చెన్నై కి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…