మొబైల్స్ తయారీదారు ఒప్పో కొత్తగా ఎ16 పేరిట ఓ స్మార్ట్ ఫోన్ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ను అమర్చారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ను ఇందులో అందిస్తున్నారు.
ఈ ఫోన్లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరాను అమర్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో లభిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్లో 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా మరో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి.
ఒప్పో ఎ16 స్మార్ట్ ఫోన్ ధర రూ.13,990 ఉండగా ఈ ఫోన్ అమెజాన్ లో ఎక్స్క్లూజివ్గా లభిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…