నటుడు, సంఘ సేవకుడు సోనూ సూద్కు చెందిన ఇళ్లలో, కార్యాలయాల్లో గత 3 రోజులుగా ఇన్కమ్ట్యాక్స్ విభాగం అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ముంబైతోపాటు లక్నోలో ఉన్న ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం ఆదాయపు పన్ను విభాగం అధికారులు సంచలన ప్రకటన చేశారు. నటుడు సోనూసూద్ రూ.20 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టారని తెలిపారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కరోనా నేపథ్యంలో సోనూసూద్ ఎంతో మందిని ఆదుకున్నారు. ఒక సంఘ సేవకుడిగా ఆయనకు మర్యాద ఇస్తాం. కానీ ఆయన పన్ను ఎగ్గొట్టారు. అందువల్ల చట్టం తన పని తాను చేసుకోక తప్పదు.. అని అధికారులు తెలిపారు.
కాగా గతేడాది జూలైలో కోవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు గాను సోనూ సూద్.. తన పేరిట చారిటీ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. దానికి రూ.18 కోట్ల మేర విరాళాలు రాగా అందులో రూ.1.9 కోట్లను సహాయం కోసం ఖర్చు పెట్టారు. మిగిలిన మొత్తం బ్యాంకు అకౌంట్లలో అలాగే ఉందని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి విరాళాలు తీసుకునే విషయంలోనూ సోనూసూద్ ఫౌండేషన్ నిబంధనలను ఉల్లంఘించిందని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు తెలిపారు.
ఇక లక్నోలో ఉన్న ఓ కంపెనీ ద్వారా సోనూ సూద్ రూ.20 కోట్ల మేర లోన్లు తీసుకున్నట్లు బోగస్ పత్రాలను సృష్టించారని, ఆ లోన్లు బోగస్ అని, లోన్లు తీసుకున్నట్లు 20 ఎంట్రీలు ఉన్నాయని, కానీ అవన్నీ ఫేక్ అని అధికారులు తెలిపారు. అందువల్ల సోనూసూద్ రూ.20 కోట్ల మేర పన్నులను ఎగ్గొట్టినట్లు గుర్తించామని అధికారులు తెలియజేశారు.
అయితే సోనూసూద్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు చేయడంపై శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ అయినందునే ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేస్తుందని వారు ఆరోపించారు. కానీ బీజేపీ నేతలు ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ కావడానికి, ఆయన ఇళ్లపై ఐటీ దాడులు జరగడానికి సంబంధం లేదని అంటున్నారు. కాగా ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…