నటుడు, సంఘ సేవకుడు సోనూ సూద్కు చెందిన ఇళ్లలో, కార్యాలయాల్లో గత 3 రోజులుగా ఇన్కమ్ట్యాక్స్ విభాగం అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ముంబైతోపాటు లక్నోలో ఉన్న ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం ఆదాయపు పన్ను విభాగం అధికారులు సంచలన ప్రకటన చేశారు. నటుడు సోనూసూద్ రూ.20 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టారని తెలిపారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కరోనా నేపథ్యంలో సోనూసూద్ ఎంతో మందిని ఆదుకున్నారు. ఒక సంఘ సేవకుడిగా ఆయనకు మర్యాద ఇస్తాం. కానీ ఆయన పన్ను ఎగ్గొట్టారు. అందువల్ల చట్టం తన పని తాను చేసుకోక తప్పదు.. అని అధికారులు తెలిపారు.
కాగా గతేడాది జూలైలో కోవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు గాను సోనూ సూద్.. తన పేరిట చారిటీ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. దానికి రూ.18 కోట్ల మేర విరాళాలు రాగా అందులో రూ.1.9 కోట్లను సహాయం కోసం ఖర్చు పెట్టారు. మిగిలిన మొత్తం బ్యాంకు అకౌంట్లలో అలాగే ఉందని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి విరాళాలు తీసుకునే విషయంలోనూ సోనూసూద్ ఫౌండేషన్ నిబంధనలను ఉల్లంఘించిందని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు తెలిపారు.
ఇక లక్నోలో ఉన్న ఓ కంపెనీ ద్వారా సోనూ సూద్ రూ.20 కోట్ల మేర లోన్లు తీసుకున్నట్లు బోగస్ పత్రాలను సృష్టించారని, ఆ లోన్లు బోగస్ అని, లోన్లు తీసుకున్నట్లు 20 ఎంట్రీలు ఉన్నాయని, కానీ అవన్నీ ఫేక్ అని అధికారులు తెలిపారు. అందువల్ల సోనూసూద్ రూ.20 కోట్ల మేర పన్నులను ఎగ్గొట్టినట్లు గుర్తించామని అధికారులు తెలియజేశారు.
అయితే సోనూసూద్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు చేయడంపై శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ అయినందునే ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేస్తుందని వారు ఆరోపించారు. కానీ బీజేపీ నేతలు ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ కావడానికి, ఆయన ఇళ్లపై ఐటీ దాడులు జరగడానికి సంబంధం లేదని అంటున్నారు. కాగా ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…