నటుడు, సంఘ సేవకుడు సోనూ సూద్కు చెందిన ఇళ్లలో, కార్యాలయాల్లో గత 3 రోజులుగా ఇన్కమ్ట్యాక్స్ విభాగం అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ముంబైతోపాటు లక్నోలో ఉన్న ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం ఆదాయపు పన్ను విభాగం అధికారులు సంచలన ప్రకటన చేశారు. నటుడు సోనూసూద్ రూ.20 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టారని తెలిపారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కరోనా నేపథ్యంలో సోనూసూద్ ఎంతో మందిని ఆదుకున్నారు. ఒక సంఘ సేవకుడిగా ఆయనకు మర్యాద ఇస్తాం. కానీ ఆయన పన్ను ఎగ్గొట్టారు. అందువల్ల చట్టం తన పని తాను చేసుకోక తప్పదు.. అని అధికారులు తెలిపారు.
కాగా గతేడాది జూలైలో కోవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు గాను సోనూ సూద్.. తన పేరిట చారిటీ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. దానికి రూ.18 కోట్ల మేర విరాళాలు రాగా అందులో రూ.1.9 కోట్లను సహాయం కోసం ఖర్చు పెట్టారు. మిగిలిన మొత్తం బ్యాంకు అకౌంట్లలో అలాగే ఉందని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి విరాళాలు తీసుకునే విషయంలోనూ సోనూసూద్ ఫౌండేషన్ నిబంధనలను ఉల్లంఘించిందని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు తెలిపారు.
ఇక లక్నోలో ఉన్న ఓ కంపెనీ ద్వారా సోనూ సూద్ రూ.20 కోట్ల మేర లోన్లు తీసుకున్నట్లు బోగస్ పత్రాలను సృష్టించారని, ఆ లోన్లు బోగస్ అని, లోన్లు తీసుకున్నట్లు 20 ఎంట్రీలు ఉన్నాయని, కానీ అవన్నీ ఫేక్ అని అధికారులు తెలిపారు. అందువల్ల సోనూసూద్ రూ.20 కోట్ల మేర పన్నులను ఎగ్గొట్టినట్లు గుర్తించామని అధికారులు తెలియజేశారు.
అయితే సోనూసూద్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు చేయడంపై శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ అయినందునే ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేస్తుందని వారు ఆరోపించారు. కానీ బీజేపీ నేతలు ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ కావడానికి, ఆయన ఇళ్లపై ఐటీ దాడులు జరగడానికి సంబంధం లేదని అంటున్నారు. కాగా ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…