భార‌త‌దేశం

ఆలస్యం చేస్తే ప్రాణాంతకమే.. ఆలస్యం చేయొద్దంటున్న నిపుణులు!

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో పంజా విసురుతోంది. అప్పటివరకు బాగా ఉన్నవారు ఉన్నఫలంగా కుప్పకూలి ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులలో ఆస్పత్రిలో సరైన సదుపాయాలు అందక మరణం పొందుతున్నారు. అయితే చాలామంది వారిలో కరోనా లక్షణాలు కనిపించిన వారు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్లనే ఈ ఈ విధంగా మరణాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా లక్షణాలు బయటపడటంతో ఇంట్లోనే ఉంటూ ఏవో మందులు వాడుతూ పరిస్థితి విషమించిన తర్వాత ఆస్పత్రి చుట్టూ పడకలు, ఆక్సిజన్ కోసం తిరుగుతూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ మరణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొదటి దశ తో పోలిస్తే రెండవ దశ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, కేవలం 3-4 రోజుల వ్యవధిలోనే వ్యాధి తీవ్రత అధికమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మొదటి దశతో పోలిస్తే రెండవ దశలో కరోనా వైరస్ వేగంగా వ్యాపించడమే కాకుండా, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ విధంగా మరణాల సంఖ్య పెరగడానికి గల కారణం వ్యాధి తీవ్రత అధికమైన తర్వాత చాలామంది ఆసుపత్రులకు రావడంతో వారికి సరైన సమయంలో సరైన చికిత్స అందకపోవడం వల్లనే మరణిస్తున్నారని తెలిపారు.కనుక ఈ మహమ్మారి పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సరైన చికిత్స తీసుకుని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య అధికారులు తెలియ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ.449కే జియో ఫ్యామిలీ ప్లాన్.. ఒకే బిల్లుపై 4 సిమ్‌లు, అన్‌లిమిటెడ్ డేటా!

టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్‌కు అనుకూలమైన కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…

Sunday, 8 February 2026, 2:44 PM

జపాన్ మ్యాగజైన్‌పై ప్రభాస్ సెన్సేషన్.. తొలి భారతీయ నటుడిగా సరికొత్త రికార్డ్!

2023లో జపాన్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్‌పై రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్‌టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…

Sunday, 8 February 2026, 12:46 PM

ఐఓసీఎల్ పానిపట్ రిఫైనరీలో 637 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…

Sunday, 8 February 2026, 10:03 AM

ఓటీటీలోనూ ప్రభాస్ ‘రాజాసాబ్’ ఫెయిల్.. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్!

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్, మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిధి కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన ది రాజా సాబ్…

Saturday, 7 February 2026, 10:28 PM

విడుదలకు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో రూ.120 కోట్ల డీల్!

కేజీఎఫ్ స్టార్ య‌ష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…

Saturday, 7 February 2026, 7:25 PM

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రొపై భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.12,600 పైగా తగ్గింపు!

స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. Motorola ఎడ్జ్ 50 ప్రొ మోడల్‌పై Amazon భారీ ఆఫర్ అందిస్తోంది.…

Saturday, 7 February 2026, 4:50 PM

సైబర్ మోసాల బాధితులకు ఆర్‌బీఐ ఊరట.. రూ.25 వేల నష్టపరిహారం!

దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక సమావేశాన్ని విస్తరించడం, అలాగే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, అర్బన్ కో-ఆపరేటివ్…

Saturday, 7 February 2026, 2:28 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తులు!

దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు Punjab National Bank (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి…

Saturday, 7 February 2026, 12:23 PM