దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో పంజా విసురుతోంది. అప్పటివరకు బాగా ఉన్నవారు ఉన్నఫలంగా కుప్పకూలి ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులలో ఆస్పత్రిలో సరైన సదుపాయాలు అందక మరణం పొందుతున్నారు. అయితే చాలామంది వారిలో కరోనా లక్షణాలు కనిపించిన వారు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్లనే ఈ ఈ విధంగా మరణాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా లక్షణాలు బయటపడటంతో ఇంట్లోనే ఉంటూ ఏవో మందులు వాడుతూ పరిస్థితి విషమించిన తర్వాత ఆస్పత్రి చుట్టూ పడకలు, ఆక్సిజన్ కోసం తిరుగుతూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ మరణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొదటి దశ తో పోలిస్తే రెండవ దశ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, కేవలం 3-4 రోజుల వ్యవధిలోనే వ్యాధి తీవ్రత అధికమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి దశతో పోలిస్తే రెండవ దశలో కరోనా వైరస్ వేగంగా వ్యాపించడమే కాకుండా, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ విధంగా మరణాల సంఖ్య పెరగడానికి గల కారణం వ్యాధి తీవ్రత అధికమైన తర్వాత చాలామంది ఆసుపత్రులకు రావడంతో వారికి సరైన సమయంలో సరైన చికిత్స అందకపోవడం వల్లనే మరణిస్తున్నారని తెలిపారు.కనుక ఈ మహమ్మారి పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సరైన చికిత్స తీసుకుని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య అధికారులు తెలియ చేస్తున్నారు.
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…
కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…
స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. Motorola ఎడ్జ్ 50 ప్రొ మోడల్పై Amazon భారీ ఆఫర్ అందిస్తోంది.…
దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక సమావేశాన్ని విస్తరించడం, అలాగే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, అర్బన్ కో-ఆపరేటివ్…
దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు Punjab National Bank (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి…