దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ఎంతటి స్థాయిలో వ్యాపించి తీవ్ర ప్రళయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబానికి అండగా ఉంటూ కుటుంబ పోషణను భరించే భర్త చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. అలా ఎన్నో కుటుంబాలు తమ కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితులలో అస్సాం ప్రభుత్వం భర్తను కోల్పోయిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
ఈ క్రమంలోనే అస్సాం ప్రభుత్వం కరోనా కారణం చేత భర్తను కోల్పోయిన మహిళల కోసం ‘ముఖ్యమంత్రి కోవిడ్-19 వితంతు సహాయ పథకం’ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద భర్తను కోల్పోయిన మహిళలకి రూ.2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ప్రకటించారు.
ఈ విధమైనటువంటి పథకం కింద మహిళలు ఆర్థిక సహాయాన్ని పొందాలంటే కేవలం ఆ కుటుంబం వార్షిక ఆదాయం 5 లక్షల లోపు మాత్రమే ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా యధావిధిగా వారికి వితంతు పెన్షన్ కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది విలువైన ప్రాణాలను కోల్పోయి అనేక కుటుంబాలలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఈ వైరస్ కారణంగా భర్తని కోల్పోయిన మహిళలకు ఉపశమనం కలిగించడం కోసమే ఈ విధమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు
ఈ విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని పొందాలనుకునే వారు తమ భర్త కరోనా కారణం వల్ల చనిపోయారని రాష్ట్రస్థాయి కోవిడ్ మరణాలు ఆడిట్ బోర్డు ధ్రువీకరించాల్సి ఉంటుంది.అలాగే, కుటుంబం వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని, కోవిడ్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి భార్యలకు ఈ పథకం వర్తించదని ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి తెలియజేశారు.
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…