దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ఎంతటి స్థాయిలో వ్యాపించి తీవ్ర ప్రళయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబానికి అండగా ఉంటూ కుటుంబ పోషణను భరించే భర్త చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. అలా ఎన్నో కుటుంబాలు తమ కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితులలో అస్సాం ప్రభుత్వం భర్తను కోల్పోయిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
ఈ క్రమంలోనే అస్సాం ప్రభుత్వం కరోనా కారణం చేత భర్తను కోల్పోయిన మహిళల కోసం ‘ముఖ్యమంత్రి కోవిడ్-19 వితంతు సహాయ పథకం’ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద భర్తను కోల్పోయిన మహిళలకి రూ.2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ప్రకటించారు.
ఈ విధమైనటువంటి పథకం కింద మహిళలు ఆర్థిక సహాయాన్ని పొందాలంటే కేవలం ఆ కుటుంబం వార్షిక ఆదాయం 5 లక్షల లోపు మాత్రమే ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా యధావిధిగా వారికి వితంతు పెన్షన్ కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది విలువైన ప్రాణాలను కోల్పోయి అనేక కుటుంబాలలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఈ వైరస్ కారణంగా భర్తని కోల్పోయిన మహిళలకు ఉపశమనం కలిగించడం కోసమే ఈ విధమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు
ఈ విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని పొందాలనుకునే వారు తమ భర్త కరోనా కారణం వల్ల చనిపోయారని రాష్ట్రస్థాయి కోవిడ్ మరణాలు ఆడిట్ బోర్డు ధ్రువీకరించాల్సి ఉంటుంది.అలాగే, కుటుంబం వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని, కోవిడ్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి భార్యలకు ఈ పథకం వర్తించదని ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి తెలియజేశారు.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…