కరోనా నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా అన్ని బ్యాంకులు వీలైనంత వరకు అన్ని లావాదేవీలను ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎస్బీఐ తన వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు ఇంటి వద్దకే నగదు తెచ్చి అందిస్తోంది. ఈ సౌకర్యాన్ని ఎస్బీఐ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
ఎస్బీఐ అందిస్తున్న డోర్ డెస్ట్ డెలివరీ సర్వీస్ తో రోజుకు రూ.20వేల వరకు ఖాతాదారులు ఇంటి వద్దే నగదు పొందవచ్చు. అంతే మొత్తంలో నగదును డిపాజిట్ చేయవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఈ సేవ అందుబాటులో ఉంటుంది. బ్యాంకు పనిదినాల్లో మాత్రమే ఈ సేవను అందిస్తారు.
ఖాతాదారులు తమ హోమ్ బ్రాంచ్ నుంచి మాత్రమే ఇలా నగదు పొందే సౌకర్యం ఉంది. నగదు డెలివరీ సమయంలో కేవైసీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సర్వీస్కు రూ.100 + జీఎస్టీ ఫీజు చెల్లించాలి. నగదు డిపాజిట్ చేసినా ఇంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 1800 1111 03 అనే నంబర్కు కాల్ చేయవచ్చు. హోం బ్రాంచి నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండే కస్టమర్లు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. చెక్బుక్ లేదా పాస్బుక్ తో నగదును విత్డ్రా చేయవచ్చు.
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…