మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొందరు వినడం లేదు. పీకలదాకా మద్యం సేవించి విపరీతమైన వేగంతో నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారి వల్ల వారికే కాదు రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు కూడా ముప్పు ఏర్పడుతోంది. తాజాగా మాదాపూర్లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద దారుణమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుజిత్, ఆశిష్ అనే ఇద్దరు యువకులు ఆడి కారులో ప్రయాణిస్తూ అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపారు. ఈ క్రమంలో వారు మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద తమ ముందు వెళ్తున్న ఆటోను కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ క్రమంలో ఆటో నుజ్జయింది. అందులో వెనుక కూర్చుని ప్రయాణిస్తున్న ఉమేష్ కుమార్ తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా ఉమేష్ కుమార్ పబ్లో విధులు ముగించుకుని ఆ సమయంలో ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కారు ముందు భాగం దెబ్బ తిన్నా లోపల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో సుజిత్, ఆశిష్ లు ప్రాణాలతో బయట పడ్డారు. ఆటో డ్రైవర్ కూడా స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆటోలో వెనుక కూర్చున్న ఉమేష్ మాత్రం మృతి చెందాడు. కాగా ఆటోను కారు ఢీకొన్న సమయంలో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…