రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు పలు సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్న విషయం విదితమే. ఫోన్లను చార్జింగ్ పెట్టుకునేందుకు కూడా సదుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే రైలు ప్రయాణికులు ఇకపై కేవలం పగటిపూట మాత్రమే ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రాత్రి పూట ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవడాన్ని నిషేధించారు.
రైళ్లలో ఇకపై ప్రయాణికులు రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఫోన్లను చార్జింగ్ పెట్టుకునేందుకు వీలు లేదు. అందుకు గాను చార్జింగ్ పాయింట్లకు చెందిన స్విచ్లను ఆఫ్ చేస్తారు. కేవలం పగటి పూట మాత్రమే ఫోన్లను చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇటీవల మార్చి 13వ తేదీన ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు బయల్దేరి వెళ్లిన శతాబ్ది ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన ఘటన నేపథ్యంలోనే రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
రైళ్లలో రాత్రిపూట ఫోన్లను, ల్యాప్టాప్లను చార్జింగ్ చేసేవారు వాటిని చార్జింగ్ పెట్టి వదిలేస్తారు. దీంతో అవి ఓవర్ హీట్ అయ్యి పేలిపోతాయి. ఫలితంగా రైళ్లలో మంటలు అంటుకుంటాయి. పైన తెలిపిన ప్రమాదం కూడా అలాగే జరిగింది. దీంతో అనేక కోచ్లు కాలిపోయాయి. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడం కోసమే రైళ్లలో ఇకపై రాత్రి పూట చార్జింగ్కు అనుమతించడం లేదు.
రైళ్లలో సిగరెట్లు కాల్చేవారిపై, మంటలు సులభంగా అంటుకునే వస్తువులను తీసుకెళ్లేవారిపై కూడా రైల్వే కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్న ఫైన్ను పెంచడం, జైలు శిక్షను పెంచడం వంటి చర్యలు చేపట్టాలని ఆలోచిస్తోంది. మరి ఆ దిశగా రైల్వే ఎలాంటి నిర్ణయాలను అమలు చేస్తుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…