ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ ప్రారంభమవుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహించనున్నాడు. అంతకు ముందు శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ కెప్టెన్గా ఉన్నాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో అయ్యర్ కు గాయం అయింది. దీంతో జట్టు యాజమాన్యం పంత్ను కెప్టెన్గా నియమించింది. ఈ మేరకు ఢిల్లీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా పంత్ తొలిసారిగా ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టబోతున్నాడు. గతంలో పంత్ ఢిల్లీ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఐపీఎల్లో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించబోతుండడం ఇదే తొలిసారి. దీంతో పంత్ కెప్టెన్గా ఎలా రాణిస్తాడు ? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఇక తనకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడంపై పంత్ స్పందిస్తూ.. తనది ఢిల్లీ అని, అక్కడే పుట్టి పెరిగానని, ఇప్పుడు ఆ జట్టుకు నాయకత్వం వహిస్తుండడం ఆనందంగా ఉందని అన్నాడు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు అతను జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని, ఈ ఎడిషన్లో ఢిల్లీకి ఐపీఎల్ టైటిల్ను అందించేందుకు కృషి చేస్తానని తెలిపాడు.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ గత రెండు సీజన్లకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ సీజన్లలో అతను కెప్టెన్ గా రాణించాడు. పంత్కు ఇదొక చక్కని అవకాశం. ఇంగ్లండ్ తో సిరీస్లో బ్యాట్తో రాణించాడు. ఇప్పుడు కెప్టెన్గా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…