ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ ఎడిషన్ ప్రారంభమవుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహించనున్నాడు. అంతకు ముందు శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ కెప్టెన్గా ఉన్నాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో అయ్యర్ కు గాయం అయింది. దీంతో జట్టు యాజమాన్యం పంత్ను కెప్టెన్గా నియమించింది. ఈ మేరకు ఢిల్లీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా పంత్ తొలిసారిగా ఐపీఎల్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టబోతున్నాడు. గతంలో పంత్ ఢిల్లీ రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఐపీఎల్లో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించబోతుండడం ఇదే తొలిసారి. దీంతో పంత్ కెప్టెన్గా ఎలా రాణిస్తాడు ? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఇక తనకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడంపై పంత్ స్పందిస్తూ.. తనది ఢిల్లీ అని, అక్కడే పుట్టి పెరిగానని, ఇప్పుడు ఆ జట్టుకు నాయకత్వం వహిస్తుండడం ఆనందంగా ఉందని అన్నాడు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు అతను జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని, ఈ ఎడిషన్లో ఢిల్లీకి ఐపీఎల్ టైటిల్ను అందించేందుకు కృషి చేస్తానని తెలిపాడు.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ గత రెండు సీజన్లకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ సీజన్లలో అతను కెప్టెన్ గా రాణించాడు. పంత్కు ఇదొక చక్కని అవకాశం. ఇంగ్లండ్ తో సిరీస్లో బ్యాట్తో రాణించాడు. ఇప్పుడు కెప్టెన్గా రాణించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…