మాతృ దినోత్సవం రోజు.. ఓ తల్లికి అవమానం!

May 10, 2021 10:33 PM

మే 8న అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకొని పెద్ద ఎత్తున మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటారు. కానీ ఈ మాతృ దినోత్సవం రోజున ఓ తల్లికి ఎంతో అవమానం జరిగింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో తెలిసిందే. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని ఝహల్వార్‌లో ఓ మహిళ కరోనా బారిన పడింది.

ఈమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మాతృ దినోత్సవం రోజున మరణించింది.అయితే ఈమెకు దహన సంస్కారాలు నిర్వహించడానికి ఆస్పత్రి అధికారులు నిరాకరించారు.ఆ తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం కోసం ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆ తల్లి కొడుకులు, బంధువులు ఎంత వేడుకున్నా అధికారుల మనసు కరగలేదు.

ఈ క్రమంలోనే గ్రామస్తులు కూడా తన తల్లి అంతిమ సంస్కారాలకు సహకరించకపోవడంతో చేసేదేమీ లేక ఆ తల్లి పిల్లలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ క్రమంలోనే తోపుడు బండిపై తన తల్లి శవాన్ని ఉంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మశాన వాటికకు ఆ తల్లి మృతదేహాన్ని తోపుడు బండి పైన తీసుకెళ్లి దహన సంస్కరణలు నిర్వహించారు. ఈ విధంగా మాతృ దినోత్సవం రోజునే ఈ తల్లికి ఎంతో అవమానం జరిగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment