సాధారణంగా మనం స్వామివారికి మొక్కులు తీర్చాలంటే ప్రదక్షణలు చేయడం, స్వామి వారికి కానుకలు చెల్లించడం, ఆలయానికి ఏవైనా దానం చేయడం ద్వారా మొక్కులు చెల్లిస్తారు. కానీ ఒడిస్సా రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఒక వింత ఆచారాన్ని పాటిస్తూ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.మయూర్ భంజ్ జిల్లాలో వరూన్ బ్లాక్ ప్రాంతంలో స్థానికులు ఆచరిస్తున్న ఈ సంప్రదాయం.. దాన్ని చూస్తున్న వారి కళ్లల్లో భయం పుట్టిస్తుంది.
ఇక్కడి ప్రజలు స్వామివారికి పూజలు చేయాలన్న, మొక్కులు తీర్చుకోవాలన్న ముళ్ళు కలిగిన నాగ జముడు మొక్కలపై పొర్లుదండాలు పెట్టీ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇది మాత్రమే కాదండోయ్ నిప్పులపై సరదాగా, అమ్మవారిని పూజిస్తూ డాన్సులు చేస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా ఇక్కడి ప్రజలు అమ్మవారికి కి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఒడిస్సాలోని ఓ మారుమూల గ్రామంలోని ప్రజలు ఇప్పటికీ ఇదే వింత ఆచారాన్ని పాటిస్తున్నారు.
ముఖ్యంగా దేవీ నవరాత్రులైన దసరా వంటి పండుగ దినాలలో ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ఈ విధంగా మొక్కులు తీర్చు కోవడం జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే ఈ విధంగా ముళ్ళ మొక్కలపై పొర్లుదండాలు పెట్టిన వారి శరీరానికి ఏమాత్రం గాయాలు తగలవు, నిప్పులపై నడిచిన వారికి ఏ విధమైనటువంటి నొప్పి తగలదనీ అక్కడి ప్రజలు చెబుతారు. ఈ విధంగా స్వామివారికి మొక్కులు తీర్చడం వల్ల వారికి ఏమీ కాకుండా వారిని ఆ దుర్గామాత కాపాడుతుందని అక్కడ భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…