ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియా వేదికగా ఈ పద్ధతులు పాటిస్తే కరోనా రాదు, ఇలా చేస్తే కరోనా రాదనే వార్తలు చక్కర్లు కడుతున్నాయి. ఈ క్రమంలోని ఏది నిజమో ఏది అబద్దమో తెలియని అయోమయంలో ప్రజలు ఉన్నారు.
ఈ విధమైనటు వంటి అవాస్తవాలను ప్రచారం చేయడంలో కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా, ప్రజాప్రతినిధులు సైతం ప్రజలను తీవ్ర అపోహలకు గురి చేస్తున్నారు. ఇదివరకే ఎంతో మంది బీజేపీ నేతలు వారు గోమూత్రం తాగడం వల్లే వారికి కరోనా లేదని, ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
తాజాగా ఎప్పుడు వివాదాలలో ఉండే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కూడా గోమూత్రం పై ప్రచారం చేపట్టారు. తాను ప్రతిరోజు గోపంచితం తాగడం వల్లే తనకు కరోనా రాలేదని వ్యాఖ్యానించారు. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ఈ విధమైనటువంటి అవాస్తవ ప్రచారాలను చేయడంతో ప్రజలు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు సైతం ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయని, ఎవరూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే విషయాలను నమ్మొద్దని, కరోనా రాకుండా ఉండాలంటే కేవలం జాగ్రత్తలు పాటించడం ఒక్కటే పరిష్కార మార్గమని నిపుణులు తెలియజేస్తున్నారు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…