కరోనా వల్ల ఎంతో మంది నిరుపేదలకు ఆహారం లభించడం లేదు. దీంతో వారు ఆహారం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఆహారం దొరక్క రోడ్లపై అవస్థలు పడుతూ కనిపిస్తున్నారు. అయితే ఓ ఇద్దరు నిరుపేద చిన్నారులు కూడా ఆ పోలీస్ కానిస్టేబుల్కు అలాగే కనిపించారు. దీంతో చలించిపోయిన అతను తన బాక్స్లోని ఆహారాన్ని వారికి ఇచ్చేశాడు.
పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్.మహేష్ కుమార్ సోమవారం రాత్రి నగరంలోని మోనప్ప ఐల్యాండ్ జంక్షన్లో రహదారిపై నిరాశ్రయులుగా ఉన్న ఓ వ్యక్తి, అతని ఇద్దరి చిన్నారులను చూశాడు. అయితే వారు మహేష్కు రోజూ కనిపిస్తూనే ఉన్నారు. కానీ సోమవారం రాత్రి కూడా వారు కనిపించడంతో ఆ వ్యక్తిని పరిస్థితి ఏమిటని విచారించాడు. దీంతో అతను తన వద్ద డబ్బులు ఉన్నాయి కానీ షాపులు మూసి ఉన్నాయని, పిల్లలకు ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారని తెలిపాడు.
దీంతో చలించిపోయిన మహేష్ కుమార్ రాత్రి తినేందుకు తాను ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్స్ నుంచి ఆహారాన్ని తీసి ఆ పిల్లలకు పెట్టాడు. పక్కనే ఉన్న ఓ హాస్పిటల్లో పేపర్ ప్లేట్లను తీసుకుని వాటిల్లో అతను తన బాక్సులోని భోజనాన్ని పెట్టాడు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో మహేష్ కుమార్ను అందరూ అభినందిస్తున్నారు. ఇక హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కానిస్టేబుల్ మహేష్ ను ప్రశంసించారు. అతనికి సన్మానం చేశారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…