దేశంలోని అసంఘటిత రంగానికి చెందిన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో డబ్బు పొదుపు చేసుకునే పథకాలను అందిస్తోంది. వాటిల్లో అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఇందులో నెల నెలా నిర్దిష్ట మొత్తంలో డబ్బును పొదుపు చేసుకోవడం వల్ల రిటైర్మెంట్ వయస్సులో నెల నెలా రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు.
18 ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి అటల్ పెన్షన్ యోజన కింద నెలకు రూ.42 కనీసం పొదుపు చేస్తే రిటైర్మెంట్ వయస్సులో నెలకు రూ.1000 పెన్షన్ పొందవచ్చు. అదే నెలకు రూ.84 పొదుపు చేస్తే రూ.2000, నెలకు రూ.126 పొదుపు చేస్తే రూ.3000, నెలకు రూ.168 పొదుపు చేస్తే రూ.4000, నెలకు రూ.210 పొదుపు చేస్తే రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు. అంటే రోజుకు రూ.7 చొప్పున 30 రోజులకు అంటే నెలకు రూ.210 పొదుపు చేస్తే రిటైర్మెంట్ వయస్సులో నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చన్నమాట.
ఇక ఈ పథకం కింద పొదుపు చేసుకునే డబ్బుకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకంలో డబ్బు పొదుపు చేసుకునే లబ్ధిదారుడు చనిపోతే అతని కుటుంబానికి రూ.1.70 లక్షల నుంచి రూ.8.50 లక్షల వరకు పెన్షన్ వెల్త్ లభిస్తుంది. వారికి నెల నెలా పెన్షన్ లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…