వేసవి కాలం వచ్చిందంటే చాలు మనకు మార్కెట్లో మామిడి పండ్లు కనిపిస్తాయి. బాగా పండిన మామిడి పండ్లను తినడానికి ఎంతో మంది ఇష్టపడతారు. కానీ పచ్చి మామిడి కాయతో పప్పు చేసి వేడివేడి అన్నంలోకి తింటే ఆ రుచి వర్ణణాతీతం. మామిడికాయ పప్పును చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి అంత రుచికరమైన మామిడికాయ పప్పు తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…
*పచ్చిమామిడికాయ ఒకటి
*కందిపప్పు ఒక కప్పు
*టమోటాలు మూడు
*పచ్చిమిర్చి15
*ఉప్పు తగినంత
*పసుపు చిటికెడు
*కొత్తిమిర
*తగినంత నీరు
*1/2టేబుల్ స్పూన్ ఆవాలు
*1/2 జీలకర్ర
*1/2 ధనియాలు
*ఉల్లిపాయ ముక్కలు
*వెల్లుల్లి రెబ్బలు
*పచ్చి కరివేపాకు
*ఎండు మిర్చి 2
* నూనె 3 టేబుల్ స్పూన్లు
ముందుగా పచ్చి మామిడికాయ తొక్క మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కంది పప్పు, పర్చిమిర్చి,టమాటాలు,మామిడి ముక్కలు, కొత్తిమీర పసుపు,తగినంత నీరు కుక్కర్ లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ వెళ్లిన తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పును బాగా రామాలి.
స్టౌవ్ పై మరో కడాయిను ఉంచి కొద్దిగా నూనె వేయాలి.నూనె వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు,ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, వెళ్లులి వేసి బాగా మగ్గనివ్వాలి.ఆవాలు చిటపట అనగానే పోపును ముందుగా రామి పెట్టుకున్న పప్పులో వేయాలి. దీంతో ఎంతో రుచికరమైన పచ్చి మామిడి కాయ పప్పు రెడీ.ఈ పప్పును వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి తింటే ప్లేట్ కాళీ కావాల్సిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…