ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ఆక్సిజన్, పడకల సౌకర్యం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా కర్నాటకలో జరిగిన ఓ సంఘటన మన దేశంలోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో,కరోనా కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితికి అద్దం పడుతుంది.
బెంగళూరు నగరంలోని కరోనాతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రిలో చేర్చడం కోసం తీసుకెళ్లారు. అయితే ఆ నగరం మొత్తం తిరిగిన ఆమెకు ఒక ఆస్పత్రిలో కూడా బెడ్ దొరకకపోవడంతో ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కుటుంబం కరోనా రోగిని తీసుకొని ఏకంగా కర్ణాటక అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. వీరికి మద్దతుగా బంధువులు,యువజన కాంగ్రెస్ నేత నాల్పాద్ అక్కడికి చేరుకొని నిరసనలో పాల్గొన్నారు.
దాదాపు అరగంట పాటు అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే సి ఎస్ రవికుమార్ వెంటనే బాధితుడికి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో బెడ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బాధితులతో కలిసి విధానసౌధ ఎదుట ఆందోళనకు దిగిన యువజన కాంగ్రెస్ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఒకటి చాలు మన దేశంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…