దేశంలో కోవిడ్ రెండో వేవ్ సృష్టించిన దారుణకాండ అంతా ఇంతా కాదు. ఎన్నో వేల మంది చనిపోయారు. అయితే రెండో వేవ్ ప్రభావం ఇంకా ముగియకముందే మూడో వేవ్ గురించి సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక తాజాగా ఎస్బీఐ వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం మన దేశంలో కోవిడ్ మూడో వేవ్ వచ్చే నెలలోనే వస్తుందని వెల్లడైంది.
కోవిడ్-19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరిటి ప్రచురించబడిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఆగస్టులో మూడో వేవ్ వస్తుందని, సెప్టెంబరులో అది తీవ్రస్థాయికి చేరుతుందని తేలింది. కరోనా రెండో వేవ్ మే 7న పతాకస్థాయికి చేరగా, మూడో వేవ్ సెప్టెంబర్లో దారుణంగా ఉంటుందని వెల్లడించింది. ఇక ఏప్రిల్లో దేశాన్ని తాకిన సెకండ్ వేవ్ మేలో గరిష్ఠానికి చేరుకుందని నివేదిక తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళతోపాటు ఇతర రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలపై ప్రభావం చూపిందని వివరించింది.
కాగా జూలై రెండోవారం నాటికి దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పడిపోతుందని, అయితే ఆగస్టు రెండో వారం నుంచి కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక సోమవారం ఒక్క రోజే దేశంలో 39,796 కరోనా కేసులు నమోదయ్యాయి. 42,352 మంది కోలుకోగా 723 మంది చనిపోయారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…