దేశంలో కోవిడ్ రెండో వేవ్ సృష్టించిన దారుణకాండ అంతా ఇంతా కాదు. ఎన్నో వేల మంది చనిపోయారు. అయితే రెండో వేవ్ ప్రభావం ఇంకా ముగియకముందే మూడో వేవ్ గురించి సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక తాజాగా ఎస్బీఐ వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం మన దేశంలో కోవిడ్ మూడో వేవ్ వచ్చే నెలలోనే వస్తుందని వెల్లడైంది.
కోవిడ్-19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరిటి ప్రచురించబడిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఆగస్టులో మూడో వేవ్ వస్తుందని, సెప్టెంబరులో అది తీవ్రస్థాయికి చేరుతుందని తేలింది. కరోనా రెండో వేవ్ మే 7న పతాకస్థాయికి చేరగా, మూడో వేవ్ సెప్టెంబర్లో దారుణంగా ఉంటుందని వెల్లడించింది. ఇక ఏప్రిల్లో దేశాన్ని తాకిన సెకండ్ వేవ్ మేలో గరిష్ఠానికి చేరుకుందని నివేదిక తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళతోపాటు ఇతర రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలపై ప్రభావం చూపిందని వివరించింది.
కాగా జూలై రెండోవారం నాటికి దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పడిపోతుందని, అయితే ఆగస్టు రెండో వారం నుంచి కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక సోమవారం ఒక్క రోజే దేశంలో 39,796 కరోనా కేసులు నమోదయ్యాయి. 42,352 మంది కోలుకోగా 723 మంది చనిపోయారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…