దేశంలో కోవిడ్ రెండో వేవ్ సృష్టించిన దారుణకాండ అంతా ఇంతా కాదు. ఎన్నో వేల మంది చనిపోయారు. అయితే రెండో వేవ్ ప్రభావం ఇంకా ముగియకముందే మూడో వేవ్ గురించి సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక తాజాగా ఎస్బీఐ వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం మన దేశంలో కోవిడ్ మూడో వేవ్ వచ్చే నెలలోనే వస్తుందని వెల్లడైంది.
కోవిడ్-19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరిటి ప్రచురించబడిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఆగస్టులో మూడో వేవ్ వస్తుందని, సెప్టెంబరులో అది తీవ్రస్థాయికి చేరుతుందని తేలింది. కరోనా రెండో వేవ్ మే 7న పతాకస్థాయికి చేరగా, మూడో వేవ్ సెప్టెంబర్లో దారుణంగా ఉంటుందని వెల్లడించింది. ఇక ఏప్రిల్లో దేశాన్ని తాకిన సెకండ్ వేవ్ మేలో గరిష్ఠానికి చేరుకుందని నివేదిక తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళతోపాటు ఇతర రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలపై ప్రభావం చూపిందని వివరించింది.
కాగా జూలై రెండోవారం నాటికి దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పడిపోతుందని, అయితే ఆగస్టు రెండో వారం నుంచి కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక సోమవారం ఒక్క రోజే దేశంలో 39,796 కరోనా కేసులు నమోదయ్యాయి. 42,352 మంది కోలుకోగా 723 మంది చనిపోయారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…