ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై ఆ యాప్ లో వినియోగదారులు చిన్న మొత్తాల్లో రుణాలను తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పేటీఎం.. పోస్ట్ పెయిడ్ మినీ పేరిట ఓ సర్వీస్ను ప్రారంభించింది. దీని ద్వారా రూ.250 నుంచి రూ.1000 వరకు చిన్న మొత్తాల్లో రుణాలను అందిస్తారు.
ఈ సేవకు గాను పేటీఎం సంస్థ ఆదిత్య బిర్లా సంస్థతో భాగస్వామ్యం అయింది. వినియోగదారులు తమ పేటీఎం యాప్లో ఈ సేవను పొందవచ్చు. దీని ద్వారా తీసుకున్న రుణంతో మొబైల్ రీచార్జిలు చేసుకోవచ్చు. బిల్లు చెల్లింపులు చేయవచ్చు. డీటీహెచ్ రీచార్జిలు, గ్యాస్ బుకింగ్, విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు.
ఇప్పటికే పేటీఎంలో పోస్ట్ పెయిడ్ పేరిట సర్వీస్ అందుబాటులో ఉంది. కానీ ఈ మినీ సర్వీస్తో తక్కువ మొత్తంలో రుణాలను అందిస్తారు. ఇక ఈ రుణానికి ఎలాంటి వడ్డీ ఉండదు. వినియోగదారులు రుణం పొందిన తరువాత 30 రోజుల్లోగా చెల్లించాలి. ఇక స్వల్ప మొత్తంలో కన్వీనియెన్స్ ఫీజును వసూలు చేస్తారు. యాక్టివేషన్ చార్జిలు కూడా లేవు.
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా…
యుద్ధ వాతావరణంలో రోజూ భయపడుతూ జీవించాల్సి రావడం దురదృష్టకరమని నటి లారాదత్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ సమస్య…
సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్ మూవీలు అంటే ఇష్టపడే వారికోసం సన్ నెక్ట్స్లో మరో మూవీ స్ట్రీమ్ కాబోతోంది. గ్రానీ (Granny)…