ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై ఆ యాప్ లో వినియోగదారులు చిన్న మొత్తాల్లో రుణాలను తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పేటీఎం.. పోస్ట్ పెయిడ్ మినీ పేరిట ఓ సర్వీస్ను ప్రారంభించింది. దీని ద్వారా రూ.250 నుంచి రూ.1000 వరకు చిన్న మొత్తాల్లో రుణాలను అందిస్తారు.
ఈ సేవకు గాను పేటీఎం సంస్థ ఆదిత్య బిర్లా సంస్థతో భాగస్వామ్యం అయింది. వినియోగదారులు తమ పేటీఎం యాప్లో ఈ సేవను పొందవచ్చు. దీని ద్వారా తీసుకున్న రుణంతో మొబైల్ రీచార్జిలు చేసుకోవచ్చు. బిల్లు చెల్లింపులు చేయవచ్చు. డీటీహెచ్ రీచార్జిలు, గ్యాస్ బుకింగ్, విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు.
ఇప్పటికే పేటీఎంలో పోస్ట్ పెయిడ్ పేరిట సర్వీస్ అందుబాటులో ఉంది. కానీ ఈ మినీ సర్వీస్తో తక్కువ మొత్తంలో రుణాలను అందిస్తారు. ఇక ఈ రుణానికి ఎలాంటి వడ్డీ ఉండదు. వినియోగదారులు రుణం పొందిన తరువాత 30 రోజుల్లోగా చెల్లించాలి. ఇక స్వల్ప మొత్తంలో కన్వీనియెన్స్ ఫీజును వసూలు చేస్తారు. యాక్టివేషన్ చార్జిలు కూడా లేవు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…