టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముంబైలో ఖరీదైన బంగ్లా కొనుగోలు చేశారని తెలియడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ మధ్య కాలంలోనే తన భార్య ఉపాసనతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారని తెలియడంతో ఈ విషయం పలు చర్చలకు కారణమవుతోంది. అయితే ఉన్నపళంగా రామ్ చరణ్ ఈ విధమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. అతని దృష్టి ముంబైపై ఎందుకు పడింది అని ఫిలింనగర్ లో పెద్ద ఎత్తున గుసగుసలు వినబడుతున్నాయి.
రామ్ చరణ్ ముంబైలో బంగ్లా కొనడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. నటీనటులు షూటింగ్ల నిమిత్తం వివిధ ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే వారు అక్కడ స్టే చేయాలంటే తప్పనిసరిగా హోటల్ వెతుక్కోవాలి. ఈ నేపథ్యంలోనే తరచు రామ్ చరణ్ ముంబై షూటింగ్ లకు వెళ్లి రావడంతో అక్కడ హోటల్ లో బస చేయడం కంటే తనకోసం ఒక ఇల్లు కొనాలనే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇళ్లను కొనుగోలు చేస్తే తనకు ముంబై వెళ్ళినప్పుడు హోటల్లో వెతుక్కుని బాధ తప్పుతుందని ఆ సమస్య కారణంగానే ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ ఇంటి విషయానికి వస్తే ముంబైలో బీచ్ ఫేసింగ్ తో ఎంతో విలాసవంతంగా ఉందని,చరణ్ ఫ్యామిలీతో సహా ముంబై వెళ్లి ఎన్ని రోజులైనా అక్కడ స్టే చేసే విధంగా ఉండేలా ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఏది ఏమైనా రామ్ చరణ్ ముంబైలో ఇల్లు కొన్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…