తెలంగాణ రాష్ట్రంలోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) ఖాళీగా ఉన్న 151 ఉద్యోగాల భర్తీకి పోలీస్ నియామ మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇవి మల్టీ జోన్ ఉద్యోగాలు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ లో విడుదల చేసిన 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలలో మల్టీ జోన్-1 లో 68 పోస్టులు ఖాళీగా ఉండగా.. మల్టీ జోన్ -2 లో 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎల్ఎల్బీ లేదా బీఎల్ చేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. అదే విధంగా ఇంటర్ తర్వాత ఐదు సంవత్సరాల లా కోర్సు ఉత్తీర్ణత అయిన వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. అలాగే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు జులై 4, 2021 నాటికి రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్ కోర్టులో మూడేళ్లకు తగ్గకుండా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
2021 july 4 వ తేదీకి అభ్యర్థుల వయస్సు 34 సంవత్సరాలలోపు వారే ఉండాలి. పరీక్షలు రాసే వారికి మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.మొదటి పేపర్లో 200 ప్రశ్నలు ఉండగా. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు కేటాయించారు. రెండవ పేపర్ 100 మార్కులకు గాను డిస్క్రిప్షన్ రూపంలో ఉంటుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ https://www.tslprb.in/
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…