ఎవరూ లేని అనాథ అతను. నిన్న మొన్నటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేవాడు. వారు కాస్తా దూరం కావడంతో అతని పరిస్థితి కడు దయనీయంగా మారింది. మానసిక వ్యాధి గ్రస్తుడు కావడంతో అతను ఎక్కడ హాని చేస్తాడేమోనని గ్రామస్థులు అతన్ని గొలుసులతో కట్టేసి విడిచి పెట్టారు. దీంతో అతన్ని పట్టించుకునే వారు లేక అత్యంత దీనావస్థలో అతను జీవితాన్ని గడుపుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు 40 కిలోమీటర్ల దూరంలో బధ్రాజి అనే గ్రామం ఉంది. అక్కడ 40 ఏళ్ల రాజారాం చక్రవర్తి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని తల్లి 3 నెలల కిందట చనిపోగా తండ్రి చనిపోయి 1 నెల అయింది. అయితే అతను మానసిక వ్యాధిగ్రస్తుడు. ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేవాడు. కానీ వారు చనిపోయాక రాజారాం పరిస్థితి దయనీయంగా మారింది.
అతను మానసిక వ్యాధిగ్రస్తుడు కావడంతో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. గ్రామంలో తిరుగుతూ రాళ్లను తీసుకుని కిటికీల అద్దాలు, వాహనాలను బద్దలు కొట్టేవాడు. దీంతో గ్రామస్థులు గొలుసులు, తాళ్లతో అతని కాళ్లు, చేతులను కట్టేసి విడిచిపెట్టారు.
అయితే అతను అలా బంధించబడి గ్రామంలో తిరుగుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో ఆ గ్రామ పంచాయతీ అధికారులను మీడియా ప్రశ్నించింది. అతనికి మానసిక వ్యాధి గ్రస్తుల కోటా నుంచి నెల నెలా ప్రభుత్వ సహాయం అందుతోంది. కానీ అతన్ని హాస్పిటల్లో చేర్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. అయితే మీడియా ఈ విషయాన్ని వారి దృష్టికి తేగానే తాము తప్పు చేశామని అంగీకరించారు. వెంటనే అతన్ని ప్రభుత్వ మానసిక హాస్పిటల్లో చేరుస్తామని చెప్పారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…