ఎవరూ లేని అనాథ అతను. నిన్న మొన్నటి వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేవాడు. వారు కాస్తా దూరం కావడంతో అతని పరిస్థితి కడు దయనీయంగా మారింది. మానసిక వ్యాధి గ్రస్తుడు కావడంతో అతను ఎక్కడ హాని చేస్తాడేమోనని గ్రామస్థులు అతన్ని గొలుసులతో కట్టేసి విడిచి పెట్టారు. దీంతో అతన్ని పట్టించుకునే వారు లేక అత్యంత దీనావస్థలో అతను జీవితాన్ని గడుపుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు 40 కిలోమీటర్ల దూరంలో బధ్రాజి అనే గ్రామం ఉంది. అక్కడ 40 ఏళ్ల రాజారాం చక్రవర్తి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని తల్లి 3 నెలల కిందట చనిపోగా తండ్రి చనిపోయి 1 నెల అయింది. అయితే అతను మానసిక వ్యాధిగ్రస్తుడు. ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేవాడు. కానీ వారు చనిపోయాక రాజారాం పరిస్థితి దయనీయంగా మారింది.
అతను మానసిక వ్యాధిగ్రస్తుడు కావడంతో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు. గ్రామంలో తిరుగుతూ రాళ్లను తీసుకుని కిటికీల అద్దాలు, వాహనాలను బద్దలు కొట్టేవాడు. దీంతో గ్రామస్థులు గొలుసులు, తాళ్లతో అతని కాళ్లు, చేతులను కట్టేసి విడిచిపెట్టారు.
అయితే అతను అలా బంధించబడి గ్రామంలో తిరుగుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో ఆ గ్రామ పంచాయతీ అధికారులను మీడియా ప్రశ్నించింది. అతనికి మానసిక వ్యాధి గ్రస్తుల కోటా నుంచి నెల నెలా ప్రభుత్వ సహాయం అందుతోంది. కానీ అతన్ని హాస్పిటల్లో చేర్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. అయితే మీడియా ఈ విషయాన్ని వారి దృష్టికి తేగానే తాము తప్పు చేశామని అంగీకరించారు. వెంటనే అతన్ని ప్రభుత్వ మానసిక హాస్పిటల్లో చేరుస్తామని చెప్పారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…