కొంతకాలం విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ ద్వారా వచ్చిన “వకీల్ సాబ్” ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పవర్ స్టార్ క్రిష్ దర్శకత్వంలో “హరహర వీరమల్లు “అనే చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్ను” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ సందడి చేయనున్నారని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఇందులో పవన్ భార్యగా నిత్య నటిస్తున్నట్లు తెలిపారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో రానా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇక రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ సందడి చేయనున్నారు.మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాకు తెలుగులో “పరశురామ కృష్ణ మూర్తి” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…