కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న వారు ప్రోనింగ్ టెక్నిక్ ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ను పెంచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపిన విషయం విదితమే. వైద్య నిపుణులు కూడా ఈ టెక్నిక్ను పాటించాలని బాధితులకు సూచిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన ఓ 82 ఏళ్ల వృద్ధురాలు కూడా ఈ టెక్నిక్ సహాయంతోనే కోవిడ్ను జయించింది.
సదరు మహిళ కోవిడ్ బారిన పడగా ఆమె ఇంట్లో ఉండి చికిత్స తీసుకోసాగింది. అయితే ఆమె ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. 79కి చేరుకున్నాయి. అయినప్పటికీ ఆమె తన కుమారులు, డాక్టర్లు సూచించిన విధంగా ప్రోనింగ్ టెక్నిక్ను పాటించింది. అలా 12 రోజుల పాటు రోజూ ఈ టెక్నిక్ను అనుసరించింది. దీంతోపాటు పౌష్టికాహారం తీసుకుంది. ఈ క్రమంలో ఆమె కోవిడ్ నుంచి బయట పడింది. ఆమెకు మొదటి నాలుగు రోజుల్లోనే ఆక్సిజన్ స్థాయిలు 94కు పెరిగాయని, ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయిలు 97గా వస్తున్నాయని డాక్టర్లు తెలిపారు.
ప్రోనింగ్ టెక్నిక్ను పాటిస్తే కోవిడ్ బాధితుల శరీరాల్లో ఆక్సిజన్ స్థాయిలు మెరుగు పడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బోర్లా పడుకుని గొంతు కింద ఒకటి, పొట్ట కింద ఒకటి, కాళ్ల కింద ఒకటి దిండు చొప్పున పెట్టుకుని శ్వాస తీసుకోవాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. చేసినప్పుడల్లా సౌకర్యాన్ని బట్టి 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ప్రోనింగ్ పొజిషన్లో ఉండాలి. దీంతో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల ఆక్సిజన్ స్థాయిలు 95 వరకు చేరుకుంటాయని వైద్యులు తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…