కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న వారు ప్రోనింగ్ టెక్నిక్ ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ను పెంచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపిన విషయం విదితమే. వైద్య నిపుణులు కూడా ఈ టెక్నిక్ను పాటించాలని బాధితులకు సూచిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన ఓ 82 ఏళ్ల వృద్ధురాలు కూడా ఈ టెక్నిక్ సహాయంతోనే కోవిడ్ను జయించింది.
సదరు మహిళ కోవిడ్ బారిన పడగా ఆమె ఇంట్లో ఉండి చికిత్స తీసుకోసాగింది. అయితే ఆమె ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. 79కి చేరుకున్నాయి. అయినప్పటికీ ఆమె తన కుమారులు, డాక్టర్లు సూచించిన విధంగా ప్రోనింగ్ టెక్నిక్ను పాటించింది. అలా 12 రోజుల పాటు రోజూ ఈ టెక్నిక్ను అనుసరించింది. దీంతోపాటు పౌష్టికాహారం తీసుకుంది. ఈ క్రమంలో ఆమె కోవిడ్ నుంచి బయట పడింది. ఆమెకు మొదటి నాలుగు రోజుల్లోనే ఆక్సిజన్ స్థాయిలు 94కు పెరిగాయని, ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయిలు 97గా వస్తున్నాయని డాక్టర్లు తెలిపారు.
ప్రోనింగ్ టెక్నిక్ను పాటిస్తే కోవిడ్ బాధితుల శరీరాల్లో ఆక్సిజన్ స్థాయిలు మెరుగు పడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బోర్లా పడుకుని గొంతు కింద ఒకటి, పొట్ట కింద ఒకటి, కాళ్ల కింద ఒకటి దిండు చొప్పున పెట్టుకుని శ్వాస తీసుకోవాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. చేసినప్పుడల్లా సౌకర్యాన్ని బట్టి 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ప్రోనింగ్ పొజిషన్లో ఉండాలి. దీంతో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల ఆక్సిజన్ స్థాయిలు 95 వరకు చేరుకుంటాయని వైద్యులు తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…