టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” సినిమా చేశారు. ఈ సినిమా తరువాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం తాజా షెడ్యూల్ కోసం ఇటలీలో వాలిపోయారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం మాత్రం కరోనా జాగ్రత్తలను పాటిస్తూ షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎందరో స్టార్ హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకోగా నాగచైతన్య మాత్రం కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ రాశి కన్నా నటించనున్నారు. ప్రస్తుతం రాశి కూడా ఇటలీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వరుస ఫ్లాప్ లను చూసిన విక్రమ్ కే కుమార్ “థాంక్యూ” చిత్రం ద్వారా విజయాన్ని అందుకోవాలని పక్కా ప్లాన్ తో ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నాగచైతన్య ఇదివరకు నటించిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల వాయిదా పడింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…