India Vs West Indies : అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ సునాయాసంగా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ తడబడింది. లక్ష్యం తక్కువే అయినప్పటికీ వెస్టిండీస్ సాధించలేక చేతులెత్తేసింది. దీంతో విండీస్పై భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్ను ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ రాణించారు. 83 బంతులు ఆడిన యాదవ్ 5 ఫోర్లతో 64 పరుగులు చేయగా.. 48 బంతుల్లో రాహుల్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్, ఓడియన్ స్మిత్లు చెరో 2 వికెట్లు తీశారు. కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకియల్ హోసెయిన్, ఫేబియన్ అలన్లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 46 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. కేవలం 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బ్యాట్స్మెన్లలో షమర్ బ్రూక్స్ (44 పరుగులు) మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 4 వికెట్లు పడగొట్టగా శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. అలాగే సిరాజ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడాలకు తలా 1 వికెట్ దక్కింది. ఈ సిరీస్లో చివరిదైన వన్డే మ్యాచ్ ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…