Chiranjeevi : నందమూరి బాలకృష్ణ తొలిసారిగా బుల్లితెరపై చేసిన షో.. అన్స్టాపబుల్. ఈ షోకు ప్రేక్షకుల నుంచి విశేషమైన రీతిలో ఆదరణ లభించింది. పలువురు స్టార్స్తో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షోలో భాగంగా ఆయన సెలబ్స్ను పలు సంచలన ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు రాబట్టారు. ఇక ఈ షో తొలి సీజన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్పై అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు చూసిన షోగా ఇది రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ షోను ప్రేక్షకులు 40 కోట్ల నిమిషాల పాటు చూశారు. ఇది కూడా ఒక రికార్డే కావడం విశేషం.
ఇక అన్స్టాపబుల్ షో చివరి ఎపిసోడ్ను సూపర్స్టార్ మహేష్ బాబుతో చేయగా.. అది బంపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే తొలి సీజన్ కూడా ముగిసింది. దీంతో ఇప్పుడు ఈ షో రెండో సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందా.. అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే రెండో సీజన్ను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మొదటి సీజన్లో మెగాస్టార్ చిరంజీవిని ఒక ఎపిసోడ్కు ఆహ్వానించాలని చూశారు. కానీ వీలు కాలేదు. దీంతో రెండో సీజన్లో అయినా కచ్చితంగా చిరంజీవిని ఈ షోకు రప్పించాలని చూస్తున్నారు. మరి చిరంజీవి ఈ షోకు హాజరు అవుతారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలలో ఆయన వరుసగా నటిస్తున్నారు. దీంతో ఆయన రెండో సీజన్కు అయినా సరే హాజరు అవుతారా.. లేదా.. అన్నది ఆసక్తికరంగా మారింది. అయినప్పటికీ కచ్చితంగా ఆయనను షోకు రప్పించాలని నిర్వాహకులు చూస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…