Gali Janardhan Reddy : మైనింగ్ కింగ్గా పేరుగాంచిన గాలి జనార్ధన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అప్పట్లో తన కుమార్తె వివాహం కోసం ఏకంగా రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వేడుక సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా డ్యాన్స్ చేసి ఒక్క రాత్రికే రూ.1 కోటి వసూలు చేసింది. ఈ విధంగా అప్పట్లో ఆయన కుమార్తె వివాహ విషయాలు వైరల్ అయ్యాయి. అయితే ఆయన మళ్లీ వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఒక్క రోజు సీఎం అవుతానని వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవగా.. ఇప్పుడు మళ్లీ ఆయనకు సంబంధించిన వార్త ఒకటి వైరల్గా మారింది.
గాలి జనార్దన్ రెడ్డి కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ఇటీవల తీసిన 777 చార్లి అనే సినిమాను చూశారు. ఇంట్లోని తన హోమ్ థియేటర్లో ఈ మూవీని ఆయన కోసం ప్రైవేట్గా స్క్రీనింగ్ వేశారు. దీంతో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆ మూవీని చూశారు. అయితే ఆయన హోమ్ థియేటర్ చిన్నపాటి థియేటర్ను పోలి ఉంది. అచ్చం థియేటర్లలోగే రిక్లైనర్ సీట్లు కూడా ఉన్నాయి. ఒక సీట్లో ఆయన కుక్క కూడా కూర్చుని సినిమా చూసింది. ఈ క్రమంలోనే ఆయన సినిమా చూస్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ మూవీని చూసిన అనంతరం ఆయన సినిమా బాగుందని అన్నారు.
ఇక గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. రాధాకృష్ణ డైరెక్షన్ లో అతను నటిస్తున్నాడు. ఈగ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీని మార్చి నెలలో లాంచ్ చేశారు. రాజమౌళి చీఫ్ గెస్ట్గా హాజరై సినిమాను ప్రారంభించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…