Mahesh Babu Businesses : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత మనందరికీ తెలుసు. అందుకనే చాలా మంది ఒక రంగంలో రాణిస్తూనే ఇంకో రంగంలో పెట్టుబడులు పెట్టి ధనాన్ని ఎక్కువగా సంపాదించాలని చూస్తుంటారు. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా తక్కువేమీ తినలేదు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇతర వ్యాపారాల్లోనూ జోరు కొనసాగిస్తున్నారు. అయితే సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు రెస్టారెంట్లను పెడుతుంటారు. ఎందుకంటే వారి పాపులారిటీతో అవి సులభంగా వృద్ధిలోకి వస్తాయి కనుక. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు సొంత మల్టీప్లెక్స్లను కూడా నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే నటుడు విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ వారి సహకారంతో ఓ మల్టీప్లెక్స్ను నిర్మించాడు. ముందుగా దీన్ని మహేష్ ప్రారంభించారని చెప్పవచ్చు.
మహేష్ బాబుకు గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ ఉంది. దాన్ని చూసి విజయ్ దేవరకొండ కూడా ఓ మల్టీప్లెక్స్ను నిర్మించుకున్నాడు. ఇక మహేష్ విషయానికి వస్తే.. ఆయన సినిమాల్లో నటిస్తారని.. ఏఎంబీ సినిమాస్ మల్టీ ప్లెక్స్ ఉందని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆయనకు ఉన్న ఇతర వ్యాపారాల గురించి చాలా మందికి తెలియదు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తారు. కానీ ఆయన పేరు తన కంపెనీలో ఎక్కడ కూడా బయటకు రాదు. ఆయన ఆ వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నారట.
ఇక మహేష్బాబు, భార్య నమత్రలు కలసి దుస్తుల వ్యాపారం కూడా చేస్తున్నారట. కానీ ఆ విషయాలు కూడా బయటకు తెలియవు. వారు ఓ ప్రముఖ మాల్స్ సంస్థతో భాగస్వామ్యం అయి వ్యాపారం చేస్తున్నారట. ఇందులోనూ వారు స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నారని సమాచారం. అలాగే ఓ హాస్పిటల్లోనూ వీరికి పార్ట్నర్ షిప్ ఉందని సమాచారం. ఇక మహేష్ ప్రస్తుతం ఒక్క సినిమాకు గాను రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇలా మహేష్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు వ్యాపారాలతోనూ ఎంతో బిజీగా ఉన్నారు. కానీ ఆయన చేసే వ్యాపారాల గురించి బయటకు ఎలాంటి వివరాలు తెలియవు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…