RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇటీవలే ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తరాదిలోనూ ఘన విజయం సాధించింది. దీంతో రాజమౌళి ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. ఈ మూవీలో తారక్ భీమ్గా.. చరణ్ అల్లూరిగా నటించి అలరించారు. అయితే అన్ని మూవీల్లోనూ చిన్న చిన్న విషయాలను కూడా దర్శకులు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నట్లే రాజమౌళి కూడా పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తీసిన సినిమాలను బాగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. ఇక ఆర్ఆర్ఆర్లోనూ ఇలాంటి ఓ చిన్న విషయమే ఉంది. దాన్ని రాజమౌళి ఎంతో జాగ్రత్తగా చూపించారు. దాని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్ మూవీలో నదిలో ఓ బాలుడు పడవపై చిక్కుకుపోయినప్పుడు భీమ్, రామరాజు ఇద్దరూ తాడుతో ఊగుతూ ఆ బాలుడికి చెరో వైపుకు వస్తారు. అనంతరం రామరాజు అప్పటి భారత జెండాను పట్టుకుని వస్తాడు. దీంతో భీమ్, రామరాజు ఇద్దరూ ఆ బాలున్ని రక్షిస్తారు. అయితే ఆ జెండా గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ఈ జెండా తొలి భారతీయ జెండా. 1906 ఆగస్టు 7న వాడుకలోకి వచ్చింది. అప్పట్లో కోల్కతాలోని పార్శీ బగన్ చౌక్లో దీన్ని మొదటిసారిగా ఆవిష్కరించారు. అయితే ఆ జెండాను కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే వాడారు. 1907లో జెండా మళ్లీ మారింది.
1906లో ఆవిష్కరించబడిన మొదటి భారతీయ జెండాపై వందే మాతరం అన్న అక్షరాలు ఉంటాయి. పైన ఆకుపచ్చ, మధ్యలో పసుపు, కింద ఎరుపు రంగులు ఉంటాయి. ఈ రంగులపై పలు చిహ్నాలు కూడా ఉంటాయి. ఇక ఈ జెండాను కేవలం సంవత్సరం పాటు మాత్రమే వాడారు. 1907లో ఇంకో జెండాను ఆవిష్కరించారు. అంటే.. మనకు ఆర్ఆర్ఆర్ మూవీలో చూపించింది.. 1906లో ఆవిష్కరించబడిన జెండా. కనుక ఆర్ఆర్ఆర్ మూవీలోని కథ కూడా 1906లో జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజమౌళి చాలా చిన్న విషయాలలో కూడా ఎంతో జాగ్రత్త వహిస్తారని చెప్పవచ్చు. అందుకనే ఆయన తీసిన సినిమాలు అన్నీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫ్లాప్ కాకుండా అన్నీ హిట్ అయ్యాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…