RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇటీవలే ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తరాదిలోనూ ఘన విజయం సాధించింది. దీంతో రాజమౌళి ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. ఈ మూవీలో తారక్ భీమ్గా.. చరణ్ అల్లూరిగా నటించి అలరించారు. అయితే అన్ని మూవీల్లోనూ చిన్న చిన్న విషయాలను కూడా దర్శకులు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నట్లే రాజమౌళి కూడా పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన తీసిన సినిమాలను బాగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. ఇక ఆర్ఆర్ఆర్లోనూ ఇలాంటి ఓ చిన్న విషయమే ఉంది. దాన్ని రాజమౌళి ఎంతో జాగ్రత్తగా చూపించారు. దాని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్ మూవీలో నదిలో ఓ బాలుడు పడవపై చిక్కుకుపోయినప్పుడు భీమ్, రామరాజు ఇద్దరూ తాడుతో ఊగుతూ ఆ బాలుడికి చెరో వైపుకు వస్తారు. అనంతరం రామరాజు అప్పటి భారత జెండాను పట్టుకుని వస్తాడు. దీంతో భీమ్, రామరాజు ఇద్దరూ ఆ బాలున్ని రక్షిస్తారు. అయితే ఆ జెండా గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ఈ జెండా తొలి భారతీయ జెండా. 1906 ఆగస్టు 7న వాడుకలోకి వచ్చింది. అప్పట్లో కోల్కతాలోని పార్శీ బగన్ చౌక్లో దీన్ని మొదటిసారిగా ఆవిష్కరించారు. అయితే ఆ జెండాను కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే వాడారు. 1907లో జెండా మళ్లీ మారింది.
1906లో ఆవిష్కరించబడిన మొదటి భారతీయ జెండాపై వందే మాతరం అన్న అక్షరాలు ఉంటాయి. పైన ఆకుపచ్చ, మధ్యలో పసుపు, కింద ఎరుపు రంగులు ఉంటాయి. ఈ రంగులపై పలు చిహ్నాలు కూడా ఉంటాయి. ఇక ఈ జెండాను కేవలం సంవత్సరం పాటు మాత్రమే వాడారు. 1907లో ఇంకో జెండాను ఆవిష్కరించారు. అంటే.. మనకు ఆర్ఆర్ఆర్ మూవీలో చూపించింది.. 1906లో ఆవిష్కరించబడిన జెండా. కనుక ఆర్ఆర్ఆర్ మూవీలోని కథ కూడా 1906లో జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజమౌళి చాలా చిన్న విషయాలలో కూడా ఎంతో జాగ్రత్త వహిస్తారని చెప్పవచ్చు. అందుకనే ఆయన తీసిన సినిమాలు అన్నీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫ్లాప్ కాకుండా అన్నీ హిట్ అయ్యాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…