Ram Charan : హీరోలు అంటే అభిమానించే వారు చాలా మందే ఉంటారు. తమ అభిమాన హీరోను కనీసం ఒక్కసారి అయినా సరే కలుసుకోవాలని పరితపిస్తుంటారు. అందులో భాగంగానే వారిని కలిసేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ కల కేవలం కొందరు ఫ్యాన్స్కు మాత్రమే నెరవేరుతుంది. ఇక కొందరు ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరోల కోసం ఎన్నో వెరైటీ పనులు కూడా చేస్తుంటారు. అలా వారు చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాగే ఓ వ్యక్తి కూడా తన అభిమాన హీరో రామ్ చరణ్ను ఆకట్టుకునేందుకు ఓ ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకు ఆయనను కలుసుకోగలిగాడు. ఇక ఈ విషయం గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని గద్వాల్ జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిం డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ మీద ఉన్న అభిమానంతో గతంలో ఇతను ఒక ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకుని దాంట్లో రామ్ చరణ్ తేజ ముఖ చిత్రం వచ్చేలా వరి పంటను పండించాడు. దీంతో అప్పట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే అలా పండించిన వరి ధాన్యాన్ని తీసుకుని అతను సుమారుగా 264 కిలోమీటర్లు నడిచి వచ్చి రామ్ చరణ్ను కలిశాడు. ఎట్టకేలకు తన కల నెరవేరిందని అతను సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక అప్పట్లో తాను పండించిన రామ్ చరణ్ ముఖ చిత్రం కలిగిన వరి పంట తాలూకు ఫొటోలు, వీడియోలను రామ్ చరణ్కు చూపించాడు. అనంతరం ఆ పంటకు చెందిన ధాన్యాన్ని చరణ్కు అందజేశాడు. దీంతో చరణ్ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. తనపై తన అభిమాని చూపిస్తున్న అభిమానానికి చరణ్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు తన ఫ్యాన్తో చరణ్ సరదాగా గడిపాడు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ తన ఫ్యాన్ను చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నాడని.. ఆయన ఫ్యాన్స్ అందరూ మురిసిపోతూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…