Headache : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం అధిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. రోజూ ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీంతోపాటు సరిగ్గా నీటిని కూడా తాగడం లేదు. ఫలితంగా డీహైడ్రేషన్ సమస్య వస్తోంది. అయితే ఇవన్నీ తలనొప్పికి కారణమవుతున్నాయి. తలనొప్పిని అలాగే వదిలేస్తే అది మైగ్రేన్కు దారి తీసే అవకాశాలు ఉంటాయి. అది తీవ్రమైన తలనొప్పిగా మారుతుంది. కనుక తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ కొందరు మెడికల్ షాపుకు వెళ్లి ఇంగ్లిష్ మందులను కొని తెచ్చి వేసుకుంటుంటారు. ఇవి అప్పటికప్పుడు తలనొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. కానీ వీటిని అధికంగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది మళ్లీ ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక తలనొప్పి వస్తే ఇంగ్లిష్ మెడిసిన్ను వాడరాదు. సహజసిద్ధంగానే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
అయితే తలనొప్పిని తగ్గించుకునేందుకు ఓ సహజసిద్ధమైన చిట్కా అందుబాటులో ఉంది. అందుకు ఏం చేయాలంటే.. అర గ్లాస్ గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. అందులో సరిగ్గా ఆరు మిరియాలను పొడి చేసి వేసి బాగా కలపాలి. తరువాత ఆ నీటిని తాగేయాలి. తలనొప్పిగా ఉన్నప్పుడు ఇలా చేస్తే వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తలనొప్పిగా ఉన్నప్పుడు ఇలా తాగడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. మిరియాలు ఘాటుగా ఉంటాయి కనుక ఇవి రక్త సరఫరాను పెంచుతాయి. దీంతో తల భాగానికి రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఫలితంగా తలనొప్పి తగ్గుతుంది. కాబట్టి ఇకపై తలనొప్పి ఎప్పుడు వచ్చినా.. ఈ విధంగా చిట్కాను పాటించి చూడండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…