Evaru Meelo Koteeswarulu : వెండితెరపై రచ్చ చేస్తున్న ఎన్టీఆర్ బుల్లితెరపై ఆకట్టుకోలేకపోతున్నాడు. బిగ్ బాస్ తొలి సీజన్లో అదరగొట్టిన ఎన్టీఆర్ రెండో సీజన్కి బైబై చెప్పాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో రీఎంట్రీ ఇచ్చాడు జూనియర్. ఈ షోలో ఎన్టీఆర్ తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నప్పటికీ షో పెద్దగా అలరించలేకపోతోంది.
మా టీవీ ఇప్పుడు అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత జీ, ఈటీవీ ఉన్నాయి. జెమిని 4 వ స్థానంలో ఉంది. దాని రేటింగ్లను మెరుగుపరచాలనే లక్ష్యంతో మాస్టర్ చెఫ్, ఎవరు మీలో కోటీశ్వరులు అనే రెండు కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే రెండు కార్యక్రమాలు విఫలమయ్యాయి.
రెండు మూడు వారాలకు రేటింగ్స్ బాగానే ఉన్నా.. రాను రాను ఈ షోకు రేటింగ్స్ పడిపోతున్నాయి. బిగ్బాస్ షో రేటింగ్స్తో అదరగొట్టిన తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్తో ఆ మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోతున్నట్టు సమాచారం. ఈ షో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా.. దీపావళి రోజున మహేష్ బాబు హాజరు కానున్నారు.
అయితే ఇక ముందు ఎన్టీఆర్ ఈ షోకు హోస్ట్గా వ్యవహరించలేకపోవచ్చనే టాక్ వినబడుతోంది. షో పెద్దగా ఆశాజనకంగా లేని కారణంగా ఎన్టీఆర్ షోకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తా అన్నా కూడా ఆయన నో చెబుతున్నట్టు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…