Evaru Meelo Koteeswarulu : వెండితెరపై రచ్చ చేస్తున్న ఎన్టీఆర్ బుల్లితెరపై ఆకట్టుకోలేకపోతున్నాడు. బిగ్ బాస్ తొలి సీజన్లో అదరగొట్టిన ఎన్టీఆర్ రెండో సీజన్కి బైబై చెప్పాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో రీఎంట్రీ ఇచ్చాడు జూనియర్. ఈ షోలో ఎన్టీఆర్ తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నప్పటికీ షో పెద్దగా అలరించలేకపోతోంది.
మా టీవీ ఇప్పుడు అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత జీ, ఈటీవీ ఉన్నాయి. జెమిని 4 వ స్థానంలో ఉంది. దాని రేటింగ్లను మెరుగుపరచాలనే లక్ష్యంతో మాస్టర్ చెఫ్, ఎవరు మీలో కోటీశ్వరులు అనే రెండు కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే రెండు కార్యక్రమాలు విఫలమయ్యాయి.
రెండు మూడు వారాలకు రేటింగ్స్ బాగానే ఉన్నా.. రాను రాను ఈ షోకు రేటింగ్స్ పడిపోతున్నాయి. బిగ్బాస్ షో రేటింగ్స్తో అదరగొట్టిన తారక్.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్తో ఆ మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోతున్నట్టు సమాచారం. ఈ షో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా.. దీపావళి రోజున మహేష్ బాబు హాజరు కానున్నారు.
అయితే ఇక ముందు ఎన్టీఆర్ ఈ షోకు హోస్ట్గా వ్యవహరించలేకపోవచ్చనే టాక్ వినబడుతోంది. షో పెద్దగా ఆశాజనకంగా లేని కారణంగా ఎన్టీఆర్ షోకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తా అన్నా కూడా ఆయన నో చెబుతున్నట్టు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…