T20 World Cup 2021 : దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 14వ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో వెస్టిండీస్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం 55 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. విండీస్ పై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ను ఎంచుకోగా.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో విండీస్ జట్టు 14.2 ఓవర్లు మాత్రమే ఆడి 55 పరుగులకు కుప్పకూలింది. విండీస్ బ్యాట్స్మెన్లు పూర్తిగా విఫలం అయ్యారు. ఎవరూ ఆకట్టుకోలేదు. వచ్చిన బ్యాట్స్మన్ వచ్చినట్లే చెత్త షాట్లు ఆడి పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టగా.. మొయిన్ అలీ, టైమల్ మిల్స్ చెరో 2 వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్, క్రిస్ జోర్దాన్లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఛేదించాల్సిన లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ ఆరంభంలో తడబడింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లను కోల్పోయి 56 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో జాస్ బట్లర్ 24 పరుగులు చేశాడు. ఓపికగా ఆడుతూ జట్టుకు విజయం అందించాడు. విండీస్ బౌలర్లలో అకియల్ హోసియన్ 2 వికెట్లు తీయగా, రవి రామ్పాల్ 1 వికెట్ తీశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…