Evaru Meelo Koteeshwarulu : మరి కొద్ది రోజులలో బుల్లితెర ఫ్యాన్స్కి మాంచి కిక్ దొరకబోతోంది. ముగ్గురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించనుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాటర్లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా కొనసాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో జనరంజకంగా మారి బుల్లితెర ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచుతున్నది. ఈ షో మరి కొద్ది రోజులలో ముగియనున్నట్టు తెలుస్తుండగా, చివరి గెస్ట్గా మహేష్ బాబు హాజరు కానున్నారు.
హాట్ సీట్లో ఉన్న మహేష్ బాబుని ఎన్టీఆర్ ఏదో ప్రశ్న అడగగా, దానికి మహేశ్ ఫోన్ ఎ ఫ్రెండ్గా పవన్ కళ్యాణ్కు కాల్ చేసి తన సపోర్ట్ తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో ముగ్గురు హీరోలు కలిసి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించనున్నారట. అయితే ఇందులో ఎన్టీఆర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తనకి బాగా ఇష్టం అయిన సినిమా “తొలిప్రేమ” అని చెప్పడం, దానికి పవన్ స్టన్నింగ్ రియాక్షన్ ఇస్తారని టాక్ నడుస్తోంది.
బిగ్బాస్ తొలి సీజన్ తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రెండో బుల్లితెర ప్రోగామ్ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో మహేష్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగనుందని సమాచారం. ఆట నాది.. కోటి మీది.. అంటూ మరోసారి ఎన్టీఆర్ తనదైన శైలిలో షోకు గ్లామర్ను తెచ్చారు.
రీసెంట్గా రాజా రవీంద్ర అనే పోలీస్ ఆఫీసర్ ఈ కార్యక్రమంలో పాల్గొని కోటి రూపాయలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ డిసెంబర్ 2వ తేదీన ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…