Aamir Khan : బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం విదితమే. తమ 15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఈ జంట గత జూలైలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే దంగల్ సినిమా నటి ఫాతిమా సనా షేక్తో అమీర్ఖాన్ రిలేషన్షిప్లో ఉన్నాడని.. అందుకనే కిరణ్ రావుకు విడాకులు ఇచ్చాడని.. అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి.
అయితే కిరణ్ రావుకు విడాకులు ఇచ్చాకనైనా అమీర్ఖాన్.. ఫాతిమాను పెళ్లి చేసుకుంటాడని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చూస్తుంటే వారు ఇంకా రిలేషన్షిప్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమీర్ఖాన్ తాజాగా ఫాతిమా సనా షేక్ను సీక్రెట్ గా వివాహం చేసుకున్నాడని చెబుతూ.. ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అమీర్ఖాన్కు, దంగల్ నటి ఫాతిమా సనా షేక్కు ఇటీవలే సీక్రెట్గా వివాహం జరిగిందని.. ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే పరీక్షించి చూడగా.. సదరు ఫొటో ఫేక్ అని తేలింది. వాస్తవానికి ఆ ఫొటోలో ఫాతిమా స్థానంలో ఉన్నది కిరణ్ రావు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీకి, పిరామల్ హెల్త్ కేర్ అధినేత కుమార్తె శ్లోకా మెహతాకు జరిగిన వివాహ వేడుకలో అమీర్ఖాన్ తన భార్య కిరణ్ రావుతో పాల్గొన్నాడు. అయితే ఆ ఫొటోలో కిరణ్ రావు ముఖానికి బదులుగా ఫాతిమా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. అనంతరం దాన్ని వైరల్గా మార్చారు. దీంతో నిజంగానే అమీర్ఖాన్ మూడో పెళ్లి సీక్రెట్ గా చేసుకున్నాడా..? అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇది ఫేక్ ఫొటో అని, ఈ వార్త ఫేక్ అని స్పష్టమైంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…