Currency Notes : ఉత్తరప్రదేశ్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి చెందిన పరిశ్రమలో ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించగా.. అందులో భారీ ఎత్తున డబ్బు బయట పడుతోంది. కోట్ల కొద్దీ రూపాయలను అధికారులు ఇప్పటి వరకు బయటకు తీశారు. ఇంకా తీస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి లభించిన డబ్బు రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పీయూష్ జైన్ అనే ఓ వ్యక్తి గత నెలలో సమాజ్వాదీ అత్తర్ (పెర్ఫ్యూమ్)ను లాంచ్ చేశాడు. ఈయనకు అక్కడి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే జీఎస్టీ, పన్ను ఎగవేసిన కేసులో గత వారం రోజుల నుంచి ఆయా శాఖలకు చెందిన అధికారులు పీయూష్ జైన్ పరిశ్రమలో సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం వరకు ఆ పరిశ్రమలో రూ.150 కోట్ల మేర డబ్బును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పటికీ అక్కడ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున డబ్బు బయట పడుతుండడం విశేషం.
ఆ పరిశ్రమలో నిర్వహించిన సోదాల్లో నోట్ల కట్టలు బయట పడుతుండగా.. వాటిని అధికారులు అక్కడికక్కడే మూడు కౌంటింగ్ మెషిన్లు పెట్టి లెక్కిస్తున్నారు. దీంతో నోట్ల కట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఆ డబ్బును చూసి అధికారులు షాకవుతున్నారు. అయితే పీయూష్ జైన్కు సంబంధించి పలు కీలకపత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక అతని సోదరుడు పమ్మి జైన్ సమాజ్వాదీ పార్టీలో నేతగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాన్పూర్లో ఉన్న కేకు అగర్వాల్ అనే మరో వ్యాపారి పరిశ్రమలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సదరు డబ్బంతా లెక్కలోకి రానిదని, పన్ను ఎగ్గొట్టి పోగు చేసినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…