Currency Notes : ఉత్తరప్రదేశ్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి చెందిన పరిశ్రమలో ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించగా.. అందులో భారీ ఎత్తున డబ్బు బయట పడుతోంది. కోట్ల కొద్దీ రూపాయలను అధికారులు ఇప్పటి వరకు బయటకు తీశారు. ఇంకా తీస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి లభించిన డబ్బు రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పీయూష్ జైన్ అనే ఓ వ్యక్తి గత నెలలో సమాజ్వాదీ అత్తర్ (పెర్ఫ్యూమ్)ను లాంచ్ చేశాడు. ఈయనకు అక్కడి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే జీఎస్టీ, పన్ను ఎగవేసిన కేసులో గత వారం రోజుల నుంచి ఆయా శాఖలకు చెందిన అధికారులు పీయూష్ జైన్ పరిశ్రమలో సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం వరకు ఆ పరిశ్రమలో రూ.150 కోట్ల మేర డబ్బును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పటికీ అక్కడ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున డబ్బు బయట పడుతుండడం విశేషం.
ఆ పరిశ్రమలో నిర్వహించిన సోదాల్లో నోట్ల కట్టలు బయట పడుతుండగా.. వాటిని అధికారులు అక్కడికక్కడే మూడు కౌంటింగ్ మెషిన్లు పెట్టి లెక్కిస్తున్నారు. దీంతో నోట్ల కట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఆ డబ్బును చూసి అధికారులు షాకవుతున్నారు. అయితే పీయూష్ జైన్కు సంబంధించి పలు కీలకపత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక అతని సోదరుడు పమ్మి జైన్ సమాజ్వాదీ పార్టీలో నేతగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాన్పూర్లో ఉన్న కేకు అగర్వాల్ అనే మరో వ్యాపారి పరిశ్రమలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సదరు డబ్బంతా లెక్కలోకి రానిదని, పన్ను ఎగ్గొట్టి పోగు చేసినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…