Kallu Chidambaram : కళ్లు చిదంబరం.. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఎన్నో సినిమాల్లో కళ్లు చిదంబరం కమెడియన్గా అలరించారు. మెల్లకన్ను వల్ల ఈయన కమెడియన్గా గుర్తింపు పొందారు. ఈయన నటించిన కొన్ని హార్రర్ సినిమాల్లో మెల్లకన్ను వల్ల ఆ పాత్రను చూస్తే భయం వేసేది. అంతలా ఈయన నటించారు. ముఖ్యంగా అమ్మోరు సినిమాలో ఈయన నటన సూపర్బ్. అలాంటి ఎన్నో భిన్నమైన క్యారెక్టర్లలో ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే కళ్లు చిదంబరంకు మెల్లకన్ను ఎలా వచ్చిందనే విషయం చాలా మందికి తెలియదు. మరి దీని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
కళ్లు చిదంబరంకు మెల్ల కన్ను ఎలా వచ్చిందో తాజాగా ఆయన తనయుడు తెలియజేశారు. కళ్లు చిదంబరంకు మెల్లకన్ను పుట్టుకతో వచ్చింది కాదు. ఆయన అప్పట్లో పోర్టులో ఉద్యోగం చేసేవారు. చిన్నతనం నుంచే నాటకాలంటే కళ్లు చిదంబరంకు ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తితోనే ఆయన సినిమాల్లోకి రాకముందే ఎన్నో నాటకాల్లో నటించారు. పోర్టులో ఉద్యోగం చేస్తూ కూడా నాటకాలను ఆయనే స్వయంగా అరేంజ్ చేసేవారు. వాటిల్లో నటించేవారు కూడా.
పోర్టులో ఉన్నప్పుడు ఆయన ఎంతో మందికి పని కల్పిస్తూ సహాయం చేసేవారు. ఇక ఒకానొక దశలో తిండి, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కళ్లు చిదంబరం ఒక కన్ను వెనుక ఉన్న నరం పక్కకి జరిగింది. దీంతో ఆయనకు మెల్లకన్ను వచ్చింది. అయితే దాన్ని సరిచేయవచ్చని డాక్టర్లు చెప్పారు. కానీ ఆయన నటించిన కళ్లు అనే సినిమా ద్వారా ఆయనకు పాపులారిటీ వచ్చింది. దీంతో మెల్లకన్ను ద్వారానే ఆయన చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. తరువాత అదే మెల్లకన్ను ఇతర సినిమాల్లోనూ కంటిన్యూ అయింది. ఒక్కో సినిమా తరువాత ఆపరేషన్ చేయించుకుందామనే అనుకున్నారు. కానీ మెల్లకన్ను వల్లనే ఆయనకు సినిమా ఆఫర్లు బాగా వచ్చాయి. దీంతో ఆయన ఆ కన్నుకు సర్జరీ చేయించుకోలేదు. ఇదీ.. కళ్లు చిదంబరం మెల్లకన్ను వెనుక ఉన్న అసలు విషయం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…