Sonu Sood : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం అతడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తనదైన శైలిలో త్రివిక్రమ్ ఈ మూవీని ముందుండి నడిపించారు. అలాగే మహేష్ యాక్షన్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో ఫైట్స్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులతో విజిల్స్ వేసేలా ఆకట్టుకుంది అతడు చిత్రం. మరి ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ మిస్ చేసుకున్నారు.
మొట్టమొదటిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమా కథను ఉదయ్ కిరణ్ తో చేయాలనుకున్నాడట. కానీ ఆ సమయంలో చిరంజీవి కూతురుతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగింది. ఇక అప్పటి నుంచి అల్లు అరవింద్ ఉదయ్ కిరణ్ డేట్స్ చూసుకునేవారు. అల్లు అరవింద్ ఈ సినిమా ఉదయ్ కిరణ్ కి సెట్ కాదని రిజెక్ట్ చేయడంతో అతడు సినిమాని ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరిపారట. కానీ పవన్ కూడా ఈ కథను రిజెక్ట్ చేయటం జరిగింది.
దాంతో త్రివిక్రమ్ చివరిగా మహేష్ బాబుకు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా ఈ సినిమాలో నాజర్ చేసిన పాత్ర కోసం మొదట శోభన్ బాబును అనుకున్నారట. కానీ శోభన్ బాబు అప్పటికే సినిమాలు చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం అతడు చిత్రంపై మరొక విషయం వినిపిస్తోంది.
అతడు చిత్రంలో సోనూసూద్ పాత్ర కోసం త్రివిక్రమ్ తనను సంప్రదించాడని వేణు తొట్టెంపూడి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. కానీ వేణు తొట్టెంపూడి ఈ సినిమా చేయనని త్రివిక్రమ్ తో చెప్పినట్టు తెలిపారు. త్రివిక్రమ్ తనకు చాలా మంచి పాత్రలు ఆఫర్ చేశాడని, కానీ తానే రిజెక్ట్ చేశానని వేణు ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…