Sonu Sood : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన చిత్రం అతడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తనదైన శైలిలో త్రివిక్రమ్ ఈ మూవీని ముందుండి నడిపించారు. అలాగే మహేష్ యాక్షన్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో ఫైట్స్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేశాయి. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులతో విజిల్స్ వేసేలా ఆకట్టుకుంది అతడు చిత్రం. మరి ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ మిస్ చేసుకున్నారు.
మొట్టమొదటిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమా కథను ఉదయ్ కిరణ్ తో చేయాలనుకున్నాడట. కానీ ఆ సమయంలో చిరంజీవి కూతురుతో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగింది. ఇక అప్పటి నుంచి అల్లు అరవింద్ ఉదయ్ కిరణ్ డేట్స్ చూసుకునేవారు. అల్లు అరవింద్ ఈ సినిమా ఉదయ్ కిరణ్ కి సెట్ కాదని రిజెక్ట్ చేయడంతో అతడు సినిమాని ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరిపారట. కానీ పవన్ కూడా ఈ కథను రిజెక్ట్ చేయటం జరిగింది.
దాంతో త్రివిక్రమ్ చివరిగా మహేష్ బాబుకు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా ఈ సినిమాలో నాజర్ చేసిన పాత్ర కోసం మొదట శోభన్ బాబును అనుకున్నారట. కానీ శోభన్ బాబు అప్పటికే సినిమాలు చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం అతడు చిత్రంపై మరొక విషయం వినిపిస్తోంది.
అతడు చిత్రంలో సోనూసూద్ పాత్ర కోసం త్రివిక్రమ్ తనను సంప్రదించాడని వేణు తొట్టెంపూడి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. కానీ వేణు తొట్టెంపూడి ఈ సినిమా చేయనని త్రివిక్రమ్ తో చెప్పినట్టు తెలిపారు. త్రివిక్రమ్ తనకు చాలా మంచి పాత్రలు ఆఫర్ చేశాడని, కానీ తానే రిజెక్ట్ చేశానని వేణు ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…