Toe Nail Fungus : మీ గోళ్ల ఆకృతి, రంగు మీ ఆరోగ్య పరిస్థితిని నిర్ధారిస్తుంది. డాక్టర్లు కొన్ని కొన్ని సమయాలలో కళ్ళు, నాలుకతోపాటు గోళ్లను చూసి మీ ఆరోగ్యం గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. అదేవిధంగా కొందరికి గోళ్లు పుచ్చిపోయి ఉంటాయి. దానికి అసలు కారణం ఏమిటనేది తెలియదు. కానీ గోళ్లు బాగా పుచ్చిపోయి నొప్పితో బాధ పడుతూ ఉంటారు. కొందరికైతే గోరు చుట్టు పక్కల భాగమంతా ఎర్రగా అయిపోతుంది. దానివలన భరించలేని నొప్పి కలుగుతుంది. ఇందుకోసం రకరకాల మందులు వాడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించదు. మరికొందరికి విటమిన్స్ లోపం కారణమైతే, మరికొందరిలో బట్టలకు వాడే సబ్బులు లేక సర్ఫ్ వలన కూడా గోర్లు పుచ్చిపోతాయి. మరి పుచ్చిపోయిన గోళ్లను తిరిగి ఆరోగ్యం ఎలా మార్చుకోవాలో ఈ చిట్కా ద్వారా తెలుసుకుందాం.
ఈ చిట్కాతో గోళ్లు పుచ్చడం తగ్గి అందంగా తయారవుతాయి. దీనికోసం ముందుగా అయిదారు లవంగ మొగ్గలను తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ లవంగాల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ గిన్నెను హీట్ లో స్టవ్ మీద పెట్టి ఐదు నుంచి పదినిమిషాల పాటు బాగా మరిగించాలి. లవంగాలలో ఉండే పోషక విలువలు మొత్తం నూనెలోకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నూనెను కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు కొంచెం కాటన్ లేదా ఇయర్ బడ్ తో ఈ నూనెను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పుచ్చిన గోళ్లపై అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు చొప్పున గోళ్లు పుచ్చిన చోట అప్లై చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే గోళ్లు పుచ్చిపోవడం తగ్గుతుంది. ముందుగా పుచ్చిన గోళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పుచ్చిన గోళ్లు మొత్తం ఊడిపోయి ఆ స్థానంలో కొత్త గోళ్లు రావడం మొదలవుతాయి. గోళ్ల లోపల ఉండే ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పడుతుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…