moto e32 : తక్కువ బడ్జెట్లోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందిస్తూ.. మోటోరోలా వినియోగదారుల మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను కూడా రిలీజ్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మోటోరోలా నుంచి చాలానే విడుదలయ్యాయి. ఇక మరో ఫోన్ ను కూడా మోటోరోలా విడుదల చేసింది. మోటో ఇ32 పేరిట మోటోరోలా ఈ ఫోన్ను లాంచ్ చేయగా.. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఇక ఇందులోని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే..
మోటో ఇ32 స్మార్ట్ ఫోన్లో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి37 ప్రాసెసర్ను ఏర్పాటు చేయగా.. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లో విడుదలైంది. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ను అందించనున్నట్లు మోటోరోలా తెలియజేసింది.
ఇక ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా.. దీనికి తోడు అదనంగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.
మోటో ఇ32 స్మార్ట్ ఫోన్ కాస్మిక్ బ్లాక్, ఐస్ బర్గ్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ ధర రూ.10,499గా ఉంది. ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ను ఇప్పటికే విక్రయిస్తున్నారు. లాంచింగ్ ఆఫర్ కింద జియో కస్టమర్లకు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2549 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…