Sai Pallavi : సాయిపల్లవి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన నటనతో అందరినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. తనకు కథ నచ్చకపోతే అవతల వ్యక్తి స్టార్ హీరో అయినా సరే.. ఆ మూవీను రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి.
అయితే ఇటీవల సాయి పల్లవి తీసే సినిమాల కారణంగా ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారని ఆమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని భావించిందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ క్రమంలోనే సాయి పల్లవి ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. టాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే నిధి అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మరో స్టార్ హీరోయిన్ కోసం చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవి నటించబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ మూవీకే హైలెట్ అవుతాయి అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇద్దరు పవర్ స్టార్ లను ఒకే తెరపై చూడబోతున్నాం అన్నమాట. ఇది పవన్, పల్లవి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. అలాగే క్రిష్ వీళ్లిద్దరి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశాడట. నిజంగా ఇది సాయి పల్లవి, పవర్ స్టార్ అభిమానులకు కేక పెట్టించే అప్డేట్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ నిజంగా సాయి పల్లవి హరిహర వీరమల్లులో నటిస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద పవన్ కి మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు జనాలు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…