Baahubali : ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది. బాహుబలి నుంచి ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించినవాళ్ళ నిరాశకి చోటే లేకుండా చేశాడు రాజమౌళి. ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో ఎక్కువ భాగం జనాలను ఆకర్షించడానికి కమర్షియల్ అంశాలు ఉంటాయి. అయినప్పటికీ కథ చెప్పడం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే జక్కన్న తీసిన మర్యాద రామన్న, ఈగ వంటి సినిమాలను బట్టి అతను ఎలాంటి సినిమాలనైనా సులువుగా తీయగలడని మనం గ్రహించవచ్చు.
అలాగే బాహుబలి చూసిన తర్వాత అతని విజన్ మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. టాలీవుడ్ లో ఇంత గొప్ప డైరెక్టర్స్ ఉన్నారా అని ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇంకా ఈ మూవీలో నటించిన ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ రాజమౌళి చిత్రీకరించిన బాహుబలి ది బిగినింగ్ ఈ జూలై 10వ తేదీకి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పట్లోనే ఈ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ దెబ్బతో డైరెక్టర్ రాజమౌళి మరియు హీరో ప్రభాస్ ప్రపంచం మొత్తానికి పరిచయమయ్యారు.
ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన బాహుబలి 2 తో వీరి క్రేజ్ మరింత పెరిగిపోయింది. బాహుబలి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి సన్నివేశం అందరికీ గుర్తుండిపోయేలా చిత్రీకరించాడు జక్కన్న. అయితే ఇప్పుడు బాహుబలి 3 కూడా ఉంటుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాహుబలి చిత్రం బృందం మాత్రం ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ తప్పకుండా బాహుబలి 3 తీసే అవకాశాలు ఉన్నాయని జక్కన్న పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇక బాహుబలి 3 త్వరలోనే పట్టాలెక్కనుంది అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీంతో బాహుబలి 3 వస్తే బాగుండు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…