Arya Movie : పుష్పతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. మొదట లెక్కల మాస్టర్ గా ఉన్న సుకుమార్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ప్రారంభించి, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టి పడేసే స్థాయికి ఎదిగాడు. తన మొదటి సినిమా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్యతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు సుకుమార్. 4 కోట్లు పెట్టి తీసిన సినిమా 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను హీరోగా నిలబెట్టిన చిత్రం ఆర్య. అయితే ఈ చిత్రానికి ముందు ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.
ఇక సుకుమార్ దిల్ రాజు నిర్మించిన దిల్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఈ సినిమా సమయంలో దిల్ రాజు సుకుమార్ లోని కసిని పసిగట్టాడట. అంతే కాకుండా దిల్ సినిమా హిట్ అయితే నీకు ఆఫర్ ఇస్తా.. కథ రెడీ చేసుకో అంటూ బంపరాఫర్ ఇచ్చాడట. దిల్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో సకుమార్ ను ఆఫీస్ కు పిలిపించుకుని కథ నచ్చింది. మనం సినిమా చేద్దామని హామీ ఇచ్చాడట. హీరోని వెతికే పనిలో మొదటగా రవితేజ, నితిన్, ప్రభాస్ లకు కథను వినిపించాడట. కానీ ఆ ముగ్గురు కూడా ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారు.
ఆ తరవాత కొత్తవాళ్లతో చేస్తే బాగుంటుందేమోనని అనుకున్నాడట. ఇక అప్పుడే గంగోత్రితో అల్లు అర్జన్ హీరోగా పరిచయం అయ్యాడు. అల్లు అర్జున్ ను చూసిన సుకుమార్ తన కథలో బన్నీనే హీరో అనుకుని దిల్ రాజుకు చెప్పాడట. ఇక దిల్ రాజు వెంటనే బన్నీని ఆఫీస్ కు పిలిచి సుకుమార్ చేత కథ వినిపించాడట. దాంతో అల్లు అర్జున్ గంగోత్రి తరవాత 96 కథలు విన్నాను అన్నీ రోటీన్ కథలు అంటూ నీరసంగా చెప్పాడట. దిల్ రాజు మాది డిఫరెంట్ కథ నీకు నచ్చుతుందని చెప్పడంతో సరేనని కథ విన్నాడట. ఆ తరవాత కొన్ని మార్పులు చేర్పులతో ఆర్య సినిమాను పట్టాలెక్కించారు. ఇక ఈ సినిమా సక్సెస్ తో సుకుమార్ క్రియేటివ్ డైరెక్టర్ గా మారగా, బన్నీ స్టార్ గా ఎదిగాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…